విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ

0
167

పత్రికా ప్రకటన

 

ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026

 

తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల తయారీ - తిరుమలలో ఇంద్రకీలాద్రి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన

 

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు అధికారులు ముందడుగు వేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, ఆలయ ఈఓ శ్రీ వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది.

 

ముఖ్య అంశాలు:

 తొలుత ఈఓ శీనా నాయక్, తిరుమల అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరిని కలిసి దుర్గమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.

 తిరుమల ప్రధాన పోటు (లడ్డూ తయారీ కేంద్రం)ను సందర్శించి, అక్కడ ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడిపదార్థాల నాణ్యత, తయారీ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

అన్నప్రసాద వితరణ: భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుంటున్నారు, వడ్డన మరియు భక్తులు భోజనం ముగించే సమయం వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 

ఇంజనీరింగ్ వివరాలు: తిరుమల ఇంజనీరింగ్ అధికారులు అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి వివరించారు.

 

త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు శీనా నాయక్ వెల్లడించారు. 

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.వి.ఎస్.ఆర్. కోటేశ్వరరావు, బి. రాంబాబు, ఏఈఓలు పి. చంద్రశేఖర్, ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:సి ఐ హెచ్చరికలు
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ CI...
By Kothuru Murali 2026-01-12 13:51:16 0 151
Andhra Pradesh
మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.
మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప...
By Pagadala Venkateswar 2026-02-06 04:18:36 0 200
Andhra Pradesh
బి సి వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంల ో మంగళవారం బీసీవ ై పార ్ ట ీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద ్ ర...
By Kothuru Murali 2025-12-24 04:36:04 0 184
Andhra Pradesh
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి..
మార్కస్ మసీదు సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు విన్నతి  చీరాల: చీరాల పట్టణంలోని మార్కస్...
By Gadiyapudi Narendra 2025-12-24 14:14:52 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com