విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ

0
211

పత్రికా ప్రకటన

 

ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026

 

తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల తయారీ - తిరుమలలో ఇంద్రకీలాద్రి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన

 

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు అధికారులు ముందడుగు వేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, ఆలయ ఈఓ శ్రీ వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది.

 

ముఖ్య అంశాలు:

 తొలుత ఈఓ శీనా నాయక్, తిరుమల అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరిని కలిసి దుర్గమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.

 తిరుమల ప్రధాన పోటు (లడ్డూ తయారీ కేంద్రం)ను సందర్శించి, అక్కడ ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడిపదార్థాల నాణ్యత, తయారీ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

అన్నప్రసాద వితరణ: భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుంటున్నారు, వడ్డన మరియు భక్తులు భోజనం ముగించే సమయం వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 

ఇంజనీరింగ్ వివరాలు: తిరుమల ఇంజనీరింగ్ అధికారులు అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి వివరించారు.

 

త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు శీనా నాయక్ వెల్లడించారు. 

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.వి.ఎస్.ఆర్. కోటేశ్వరరావు, బి. రాంబాబు, ఏఈఓలు పి. చంద్రశేఖర్, ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Health & Fitness
WHO Pandemic Accord Stalemate
The World Health Organization (WHO) has hit a major roadblock ahead of the upcoming World Health...
By Dunna Jessicaruth 2026-05-19 06:51:00 0 76
Andhra Pradesh
దళిత నాయకులు అంటే అంత చిన్న చూపా
దళిత విద్యార్థులు విద్యార్థి సంఘాల్లో ఉండకూడదా.దళిత విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఎందుకు అంత...
By Boya Dasthagiri 2026-06-19 12:34:35 0 137
Telangana
లోయోలా అకాడమీలో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు.|
    సికింద్రాబాద్ : తెలంగాణ – లోయోలా అకాడమీ 1976లో స్థాపించబడి, శ్రేష్ఠత,...
By Sidhu Maroju 2025-12-20 10:11:54 0 212
Andhra Pradesh
రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే !! కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్ నంద్యాల జిల్లా  డోన్  నియోజకవర్గ పరిధి లోని  కొత్తకోట...
By Hari Krishna 2026-02-03 12:34:36 0 480
SURAKSHA
G. Sudheer Babu: A Legacy of Integrity in Indian Policing
A Steadfast Guardian: The Inspiring Journey of a True Public Servant  In the high-stakes...
By Kalaga Sailaja 2026-07-11 07:34:06 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com