విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ

0
89

పత్రికా ప్రకటన

 

ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026

 

తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల తయారీ - తిరుమలలో ఇంద్రకీలాద్రి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన

 

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు అధికారులు ముందడుగు వేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, ఆలయ ఈఓ శ్రీ వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది.

 

ముఖ్య అంశాలు:

 తొలుత ఈఓ శీనా నాయక్, తిరుమల అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరిని కలిసి దుర్గమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.

 తిరుమల ప్రధాన పోటు (లడ్డూ తయారీ కేంద్రం)ను సందర్శించి, అక్కడ ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడిపదార్థాల నాణ్యత, తయారీ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

అన్నప్రసాద వితరణ: భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుంటున్నారు, వడ్డన మరియు భక్తులు భోజనం ముగించే సమయం వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 

ఇంజనీరింగ్ వివరాలు: తిరుమల ఇంజనీరింగ్ అధికారులు అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి వివరించారు.

 

త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు శీనా నాయక్ వెల్లడించారు. 

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.వి.ఎస్.ఆర్. కోటేశ్వరరావు, బి. రాంబాబు, ఏఈఓలు పి. చంద్రశేఖర్, ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Technology
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day...
By BMA ADMIN 2025-05-22 18:03:45 0 2K
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు...
By Sidhu Maroju 2026-02-05 10:15:08 0 66
Health & Fitness
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors Explain New Symptoms
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors...
By BMA ADMIN 2025-05-21 09:57:11 0 2K
Maharashtra
Tracking Cars or People The VLTD Dilemma
Maharashtra has fitted nearly 95,000 vehicles with GPS-enabled Vehicle Location Tracking Devices...
By Pooja Patil 2025-09-15 04:23:59 0 131
Andhra Pradesh
ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.. ఇవాళ్టి కార్యక్రమాలు రద్దు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పల్ప అస్వస్థతకు...
By SivaNagendra Annapareddy 2025-12-24 06:44:49 0 159
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com