విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ

0
213

పత్రికా ప్రకటన

 

ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026

 

తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల తయారీ - తిరుమలలో ఇంద్రకీలాద్రి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన

 

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు అధికారులు ముందడుగు వేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, ఆలయ ఈఓ శ్రీ వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది.

 

ముఖ్య అంశాలు:

 తొలుత ఈఓ శీనా నాయక్, తిరుమల అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరిని కలిసి దుర్గమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.

 తిరుమల ప్రధాన పోటు (లడ్డూ తయారీ కేంద్రం)ను సందర్శించి, అక్కడ ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడిపదార్థాల నాణ్యత, తయారీ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

అన్నప్రసాద వితరణ: భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుంటున్నారు, వడ్డన మరియు భక్తులు భోజనం ముగించే సమయం వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు.

 

ఇంజనీరింగ్ వివరాలు: తిరుమల ఇంజనీరింగ్ అధికారులు అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి వివరించారు.

 

త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు శీనా నాయక్ వెల్లడించారు. 

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె.వి.ఎస్.ఆర్. కోటేశ్వరరావు, బి. రాంబాబు, ఏఈఓలు పి. చంద్రశేఖర్, ఎన్. రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Title: Gokaldas Exports Emerges as a Top Stock Pick
Bengaluru-based garment manufacturer Gokaldas Exports has been identified as one of the top stock...
By Navya Sree 2026-06-29 05:25:10 0 42
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా...
By Pagadala Venkateswar 2026-03-18 06:26:18 0 176
Business & Finance
Labour Registration Secures Every Business Legally
Labour registration is a crucial legal requirement for businesses employing workers, ensuring...
By Navya Sree 2026-07-09 07:31:23 0 82
Telangana
BRS మండల నాయకులను పరామర్శించిన కేటీఆర్
ఖమ్మం జిల్లా BRS కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల...
By Krishna Balina 2026-01-08 09:25:04 0 239
Andhra Pradesh
పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కింద...
By Pagadala Venkateswar 2026-04-14 05:33:02 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com