AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.

0
112

ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ

ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత

ఫిబ్రవరి 1న బడ్జెట్, ఆదివారం కావడంతో ప్రభుత్వ నిర్ణయం

ఈ నెల‌ 30నే సచివాలయాలకు నగదు విడుదల చేయ‌నున్న అధికారులు

ఏపీలోని పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం తీపి క‌బురు చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతినెలా అందించే పింఛన్లను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను డబ్బులను ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన నగదును ఈ నెల‌ 30 నాటికే సచివాలయాలకు పంపించేందుకు చర్యలు చేపట్టారు.

 

సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి ఫిబ్రవరి 1న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఆదివారం కూడా వచ్చింది. ఈ కారణాల వల్ల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయించడం ఇబ్బంది అవుతుందని భావించిన ప్రభుత్వం, ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

పింఛన్ల పంపిణీ తేదీలను ఇలా మార్చడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వం ఒకటో తేదీకి ముందే పింఛన్లు పంపిణీ చేసింది. సాధారణంగా నెల మొదటి తేదీన సెలవు దినం వచ్చినప్పుడు, లబ్ధిదారుల సౌకర్యం కోసం ముందుగానే నగదు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే జనవరి 1న నూతన సంవత్సరం సెలవు కావడంతో డిసెంబర్ 31నే పింఛన్లు అందజేశారు. ఇప్పుడు అదే తరహాలో ఫిబ్రవరి నెల పింఛన్లను కూడా ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: బంగారు దుకాణాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో బుధవారం బంగారు నగల దుకాణాల నిర్వాహకులతో సీఐ...
By Kothuru Murali 2026-05-13 18:53:39 0 45
Andhra Pradesh
Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు...
By Pagadala Venkateswar 2026-02-20 11:38:17 0 214
Andhra Pradesh
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు.
  మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌లా వ్యవహరిస్తా: సీఎం చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-20 03:49:29 0 34
Andhra Pradesh
Kolusu Parthasarathy: 11 సీట్లకే పరిమితమైనా మీ 'తాచుపాము' బుద్ధి మారలేదు: మంత్రి పార్థసారథి.
ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ నాడు అసెంబ్లీలో జై...
By Pagadala Venkateswar 2026-01-17 11:19:01 0 155
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరులో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం ఒక భవనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు...
By Kothuru Murali 2026-05-22 14:25:50 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com