YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.

0
165

YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

28-01-2026 Wed 08:42 | Andhra

YS Jagan to Meet Bhimavaram Leaders Today

ఉదయం 11 గంటలకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం

నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్

గత వారం ఏలూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైనం

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించనున్నారు. 

 

ప్రతి బుధవారం రాష్ట్రంలోని ఒక నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ గత వారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరించిన వైఎస్ జగన్ .. పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Search
Categories
Read More
Telangana
Alwal : save hindu graveyard
    GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
By Sidhu Maroju 2025-07-08 08:25:31 0 1K
Manipur
Van Mahotsav 2026: Green Drive Combats Landslides
"Van Mahotsav Week," India’s annual "Festival of Forests," has officially commenced across...
By Lokeshwari Panthadi 2026-07-02 05:46:45 0 65
Andhra Pradesh
ప్రభుత్వ పథకాలను ప్రజల్లేకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం రాయచోటి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రామాపురం మండలం రాసపల్లి గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-18 06:15:05 0 206
Mizoram
Mizoram Launches NID Pulse Polio Immunisation Drive
The government of Mizoram has officially launched its National Immunisation Day (NID) Pulse Polio...
By Lokeshwari Panthadi 2026-07-02 06:31:43 0 63
Andhra Pradesh
పుంగనూరు: పూడికతీత పనులను సమగ్రవంతంగా చేయాలి: బీజేపీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులను సమగ్రంగా చేపట్టాలని...
By Kothuru Murali 2026-06-02 15:25:46 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com