జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం

0
192

జనసేన నాయకుల మానవతా 

 

ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల సందీప్ రూ. 50 వేలు, శ్రీ విశ్వక్ సేన్ రూ. 50 వేలు ఆర్థిక సహాయం 

 ఉపాధి కల్పించిన శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు 

ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు శ్రీ పుక్కాల రాజశేఖర్ కుటుంబానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డా.పంచకర్ల సందీప్ రూ.50 వేలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ శ్రీ విశ్వక్ సేన్ రూ.50 వేలు మొత్తం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా జనసేన నాయకుల మానవతా దృక్పథం మరోసారి నిరూపితమైంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంకు విచ్చేసిన శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు సమక్షంలో చెక్కులను అందజేశారు. శ్రీ పుక్కాల రాజశేఖర్ సతీమణి శ్రీమతి హరిప్రియ ఇటీవల ఎచ్చెర్ల పర్యటనలో శ్రీ నాగబాబు గారిని కలిసి.. సంబంధం లేని ఘర్షణలో తన భర్తను హత్యచేశారని, కుటుంబ పోషణ భారంగా ఉన్నదని మొరపెట్టుకున్నారు. అప్పటికప్పుడు కొంత ఆర్థికసహాయం అందజేసిన శ్రీ నాగబాబు గారు ఉపాధి అవకాశం కల్పించారు. శ్రీమతి హరిప్రియ ఫిబ్రవరి నుంచి ఉద్యోగంలో చేరనున్నారు. మానవతా దృక్పథంతో జనసైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ పంచకర్ల సందీప్, శ్రీ విశ్వక్ సేన్ లను శ్రీ కె. నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Boosts Employment and Enterprise
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening employment opportunities and...
By Fathima Safa 2026-07-02 07:57:12 0 68
Telangana
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....
  ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...
By Gujile Ramu 2026-04-26 09:40:43 0 138
Andhra Pradesh
పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-05-01 12:15:54 0 94
Telangana
గాయని మంగ్లీ కేసుతో నాకు ‎ఎలాంటి సంబంధం లేదు"
ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా...
By Ponnala Srinivasrao 2026-04-12 01:10:07 0 166
Andhra Pradesh
పుంగనూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
శుక్రవారం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో...
By Kothuru Murali 2026-05-15 15:19:43 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com