లోతుకుంటలో సందడిగా బాక్స్ క్రికెట్ టోర్నీ ముగింపు వేడుకలు.|

0
160

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : లోతుకుంట లక్ష్మీ కళ మందిర్ థియేటర్ ఎదురుగా నిర్వాహకుడు కంది కంటి యశ్వంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కె.ఆర్.జి (లేట్ కందికంటి రవికుమార్ గౌడ్)  మెమోరియల్ తొలి బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ క్లోజింగ్ సెర్మనీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, బాక్స్ క్రికెట్ మ్యాచ్‌లను తిలకించడంతో పాటు స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, యువత క్రీడల వైపు మొగ్గు చూపడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.

అలాగే లేట్ కందికంటి రవికుమార్ గౌడ్  స్మృతిలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ అభినందనీయమని, క్రీడల ద్వారా వారి జ్ఞాపకాన్ని నిలుపుకోవడం గొప్ప విషయమని ఎమ్మెల్యే  తెలిపారు. విజేతలకు మరియు పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్  శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీ అనిల్ కిషోర్ గౌడ్, నేమూరి శ్రీధర్ గౌడ్, అరుణ్ రావు, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు, యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
By Chennaiah Kati 2026-01-24 06:09:36 0 241
Telangana
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్...
By Sidhu Maroju 2025-10-09 10:03:16 0 212
Goa
Goa to Launch New Sports Policy by 2025, Says SAG Chief |
Goa will unveil a new Sports Policy by the end of 2025, according to Ajay Gaude, the...
By Pooja Patil 2025-09-16 08:55:38 0 910
Andhra Pradesh
మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-08 07:31:28 0 102
Andhra Pradesh
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్...
By Gadiyapudi Narendra 2026-01-04 16:19:40 0 432
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com