కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!

0
363

కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఒకప్పటి వెండితెర నటి, సోషల్ మీడియా స్టార్ విష్ణుప్రియ తండ్రి, తెలంగాణ వ్యాపారవేత్త సూర్యనారాయణ హత్యోదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన దాడి కాదని.. ఒక వివాహేతర సంబంధం, ఆపై జరిగిన హత్య, దానికి బదులుగా జరిగిన ప్రతీకార హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

పర్యాటక కేంద్రమైన తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఒక భయంకరమైన హత్యోదంతం వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటి విష్ణుప్రియ తండ్రి అయిన సూర్యనారాయణ (73) తన సొంత బంగళాలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఇది సాధారణ హత్య కాదని.. పక్కా ప్లాన్‌తో జరిగిన ప్రతీకార దాడి అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

కుర్చీకి కట్టేసి.. నోటికి టేపులు వేసి..

పోలీసుల కథనం ప్రకారం.. కొడైకెనాల్‌లోని కురింజి ఆండవర్ టెంపుల్ రోడ్డులో సూర్యనారాయణకు ఒక విలాసవంతమైన బంగళా ఉంది. ఆదివారం తెల్లవారుజామున పలువురు దుండగులు.. దొంగతనంగా ఇంట్లోకి చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులను, యజమాని సూర్యనారాయణను బలవంతంగా మూడు కుర్చీల్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశారు.

అనంతరం సూర్యనారాయణ అరవకుండా ఉండేందుకు హెవీ డ్యూటీ ప్యాకింగ్ టేపులతో ముఖం, నోటిని గట్టిగా చుట్టేశారు. ఈక్రమంలోనే ఆయన ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సూర్యనారాయణ వద్ద పనిచేసే అసిస్టెంట్ ఒకరు ఎలాగోలా తాళ్లను విప్పుకుని.. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Search
Categories
Read More
Goa
Goa Shipping Firm Director Held in Human Trafficking Case |
A director of a Goa-based shipping company was detained at Mumbai airport over alleged links to a...
By Pooja Patil 2025-09-16 09:00:07 0 896
Andhra Pradesh
ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి
రాజకీయ పార్టీ నాయకులు ఓటట్ల జాబితా సవరణకు సహకరించాలని ఎమ్మార్వో ఎం.శ్రీను, ఎన్నికల డీటీ...
By Boiena Rajesh 2026-04-08 01:44:45 0 144
Andhra Pradesh
మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-02-28 07:15:36 0 95
Andhra Pradesh
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-04-19 11:21:40 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com