గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు

0
130

కృష్ణాజిల్లా పోలీస్

 

*గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,*

 

ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ వి .విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు ఏ.ఆర్ పోలీస్ పేరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ ను ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులతో కలిసి వీక్షించారు.

 

 🔹పెరేడ్ కమాండర్ గా అడ్మిన్ ఆర్.ఐ రాఘవయ్య గారు వ్యవహరించారు. ముందుగా ఎస్పీ గారు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగుర వేశారు. తరువాత పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల పరేడ్ ను స్వయంగా పరిశీలించారు.

 

*ఈ సంధర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..*

 

 🔹సివిల్, ఏ‌ఆర్, హోంగార్డ్సు, విద్యార్థుల ప్లటూన్స్ అందరూ చాలా చక్కటి టర్నవుట్ తో పరేడ్ రిహార్సల్స్ బాగా చేశారని పెరెడ్ పై సంతృప్తి వ్యక్తపరిచారు, పెరెడ్ లో పాల్గొంటున్న సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలనతో రిహాసల్స్ లో పాల్గొనాలని, ఈ వేడుకలు గర్వకారణంగా నిలిచేలా ప్రతి అంశాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. 

 

 🔹ఇదే స్పూర్తితో రేపు కూడా రెట్టింపు ఉత్సాహంతో పెరేడ్ చేయాలని సూచించారు.

 

🔹గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాట్లతో భద్రతా పరంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

🔹ఈ కార్యక్రమంలో బందరు డిఎస్పి సిహెచ్ రాజా గారు, ఏ ఆర్ డి.ఎస్.పి వెంకటేశ్వరరావు గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్ గారు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు...
By Boya Dasthagiri 2026-04-02 10:17:01 0 87
Jharkhand
Jharkhand Coal Minister Announces Wage & Safety Reforms for Workers
The #CoalMinister in #Jharkhand announced improved wages and working conditions for coal...
By Pooja Patil 2025-09-13 11:38:14 0 165
Andhra Pradesh
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంజుమన్ ఆస్తులు.
రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు...
By John Baji 2025-12-27 11:41:33 0 122
Andhra Pradesh
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
By Kothuru Murali 2026-01-21 10:43:56 0 123
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి...
By Pagadala Venkateswar 2026-02-16 05:00:45 0 152
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com