ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.

0
34

ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు 16,000 ఇ-సైకిళ్లు

ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

సులువైన రుణాల కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం

రాష్ట్రంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సాహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ఒక ఉద్యమంగా మార్చాలని, దీనికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందికి అందించాలని నిర్ణయించారు.

 

సోమవారం నాడు సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ సైకిళ్లు, వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యాలయ సిబ్బందికి అందించే 16,000 ఇ-సైకిళ్లను సులభ వాయిదాల (ఈఎంఐ) పద్ధతిలో ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

 

సామాన్యులు కూడా ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా రుణాలు అందించేందుకు ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలన్నారు. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేయండి,బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు
వరంగల్‌ పట్టణంలో ఈనెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సభను జయప్రదం చేసి.. కాంగ్రెస్‌...
By Ponnala Srinivasrao 2026-05-05 02:03:31 0 81
Rajasthan
Rajasthan Govt Transfers 222 RAS Officers in Major Shuffle |
The Rajasthan government has carried out a major administrative reshuffle, transferring 222...
By Pooja Patil 2025-09-15 12:16:52 0 683
Andhra Pradesh
రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి ముగింపు వేడుకలు
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ముగింపు వేడుకలు రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ...
By Vadlamudi NagaVenkat 2026-03-16 09:59:06 0 579
Andhra Pradesh
ఈనెల 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి పండగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు
ఈనెల 27వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్నం ఎన్జీవో కాలనీలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు...
By Benguluri Madhubabu 2026-03-25 14:40:46 0 160
Andhra Pradesh
చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..
చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-03 05:50:49 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com