గుంటూరు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి లతా గారు అన్నారు.

0
588

 

<>kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.

 

*గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) గౌరవనీయులు శ్రీమతి లత గారు అన్నారు.* గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు బ్రాడిపేటలోని మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) శ్రీమతి లత గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా *“అంతర్జాతీయ బాలిక దినోత్సవం”* ను పురస్కరించుకుని *“మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న సైబర్ నేరాలు”* అనే అంశంపై విద్యార్థులు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి లత గారు మాట్లాడుతూ, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల అధిక వినియోగం వల్ల విద్యార్థులు తెలియకుండానే సైబర్ నేరాలకు ఎలా గురవుతున్నారో ఉదాహరణలతో వివరించారు. విద్యార్థినులు తమ కుటుంబానికి ఎంత ముఖ్యమో గుర్తించి బాధ్యతగా మెలగాలని సూచించారు. యుక్త వయస్సులో ఉండే ఆకర్షణలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వలన వచ్చే ప్రమాదాలపై అవగాహన కలిగి, వీటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. సామాజిక మాధ్యమాలను అవసరానికి పరిమితంగా మాత్రమే ఉపయోగించాలని, మితిమీరిన వినియోగం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఎవరితోనూ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేయకూడదని, ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తులతో పరిచయాలు, చాటింగ్ చేయడం ప్రమాదకరమని తెలియజేశారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే లాభాలు ఉంటాయని, దుర్వినియోగం చేస్తే జీవితంపై తీవ్రమైన ప్రభావాలు పడతాయని స్పష్టం చేశారు. విద్యార్థి దశలో చదువులపై ఏకాగ్రత పెట్టి, ఉన్నత విద్య సాధించి, జీవితంలో మంచి స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, గురువులకు, తమ ప్రాంతానికి మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ధైర్యంగా ముందుకు సాగుతూ, సురక్షిత వాతావరణంలో ఉండి తమను తాము రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ శ్రీ మట్టుపల్లి మోహన్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించేందుకు నిరంతర కృషి చేయాలని సూచించారు. నేటి కాలంలో సెల్‌ఫోన్ వినియోగం అధికంగా పెరిగిందని, సెల్‌ఫోన్లకు దూరంగా ఉన్నప్పుడే విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి సారించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ శ్రీ మట్టుపల్లి మోహన్ గారు, అరండల్పేట ఎస్‌.ఐ. శ్రీ ఏడుకొండలు గారు, కోర్టు సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి టమోటా మార్కెట్లో పతనం దిశగా ధరలు
మదనపల్లెలో టమోటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తున్నాయి ఆదివారం మార్కెట్ కు 1630 మెట్రిక్ టన్నులు...
By Benguluri Madhubabu 2026-06-28 12:19:11 0 106
Telangana
చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారిని దర్శించుకున్న మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు
మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి...
By Thalakayala Nagashiva 2026-04-13 10:13:52 0 281
Telangana
బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా...
By Ponnala Srinivasrao 2026-03-17 08:19:25 0 237
Telangana
"మల్కాజిగిరి పోలీసుల ‘బ్లాక్ ఆపరేషన్’.. ఒక్కరోజే 627 వాహనాలపై వేటు!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్మ్ మరియు టింటెడ్...
By Sidhu Maroju 2026-04-28 15:37:05 0 260
Andhra Pradesh
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు  15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:10:49 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com