Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.

0
137

గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు 

15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం

వాతావరణం మెరుగుపడిన తర్వాత ఏటీసీ సూచనలతో విమానం సురక్షితంగా ల్యాండింగ్  

వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సుమారు 15 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎయిర్ పోర్ట్ రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో ల్యాండింగ్ సమస్య ఎదురైంది. 

 

ఉదయం సమయంలో గన్నవరం పరిసరాల్లో పొగమంచు తీవ్రంగా ఉండటంతో విమానాల రాకపోకలకు అవసరమైన విజిబిలిటీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పటికీ..పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఏటీసీ ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో పైలట్లు విమానాన్ని గాలిలోనే ఉంచి సుమారు 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణం కాస్త మెరుగుపడడంతో ఏటీసీ సూచనల మేరకు విమానం సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. 

 

ఏపీ ప్రభుత్వంతో సంజీవని వైద్య సేవలతో పాటు కొన్ని కీలక సామాజిక ప్రాజెక్టులపై చర్చల కోసం బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన చేసే ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎవర్రా మీరంతా.! పైకి చూసి డెలివరీ పార్శిళ్లు పికప్ అనుకునేరు.. అసలు యవ్వారం వేరుంది
దొంగతనం కూడా దర్జాగా చేసేస్తున్నారు ఇక్కడ ఇద్దరు యువకులు. అది కూడా నడిరోడ్డు మీద అందరూ...
By SivaNagendra Annapareddy 2025-12-16 08:40:01 0 298
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 158
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 143
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: అగ్నిప్రమాదంలో 140 చెట్లు దగ్ధం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో...
By Kothuru Murali 2026-02-20 08:20:52 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com