సీ సీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల

0
62

కర్నూలు : నంద్యాల : డోన్ 

డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం :

రూ.19 లక్షలతో సీసీ కాలువల నిర్మాణానికి భూమి పూజ

ఈ రోజు డోన్ పట్టణంలోని 3వ వార్డు స్వీపర్స్ కాలనీ లో రూ.19 లక్షల వ్యయంతో సీసీ కాలువల నిర్మాణ పనులకు గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ, డోన్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

సీసీ కాలువల నిర్మాణంతో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తొలగి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా మరియు పరిశుభ్రమైన పరిసరాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
*ఢిల్లీ*   తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 14:50:27 0 113
Bharat
👉 వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి...
By SivaNagendra Annapareddy 2025-12-23 07:56:19 0 159
Andhra Pradesh
శిక్షణా కానిస్టేబుల్ లకు దిశా నిర్దేశం చేసిన కర్నూలు ఎస్పీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా...చట్టాల గురించి తెలుసుకోవాలి ... సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని...
By Hari Krishna 2025-12-31 13:04:18 0 109
Telangana
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...
By Sidhu Maroju 2025-06-11 15:16:37 0 1K
Andhra Pradesh
జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం
విజయవాడ  (17-12-2025)   *స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* ...
By Rajini Kumari 2025-12-17 09:46:01 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com