జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి బృందాలు సంయుక్తంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు...
Posted 2026-01-22 12:53:19
0
432
చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి బృందాలు సంయుక్తంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు మరియు వివిధ ప్రాంతాలలోని మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి,శక్తి యాప్ ఉపయోగాల గురించి, మహిళా సంబంధిత చట్టాల గురించి సైబర్ నేరాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారి నుండి రక్షణ కల్పించాలంటే ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనే దాని గురించి బాలికలకు అవగాహన కలిగి ఉండాలన్నారు.
విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో డెమో ప్రదర్శించి సరైన మరియు అసహజ స్పర్శల మధ్య తేడాను వివరించారు.
ఎవరైనా అపరిచిత వ్యక్తులు బ్యాడ్ టచ్ చేయటానికి ప్రయత్నిస్తే వెంటనే ఉపాధ్యాయులకు గాని, తల్లిదండ్రులకు గాని, పోలీస్ వారికి గాని తెలియజేస్తే వారికి వెంటనే సాయం అందుతుందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందే సాధనంగా "శక్తి యాప్" ఉపయోగపడుతదిఅన్నారు.
శక్తి యాప్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చెయ్యాలి అనే విషయాలను వివరించడమే కాకుండా శక్తి యాప్ ను ఎలా పని చేస్తుందో అందరికీ అర్థమయ్యే విధంగా SOS
విధానాన్ని పోలీస్ అధికారులు వివరించారు.
మాదకద్రవ్యాలకు విద్యార్థులు, యువత బానిసలై తమ జీవితాలను పాడుచేసుకోకూడదని హెచ్చరించారు.
సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, డిజిటల్ అరెస్ట్ పలు ఇతర రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.
గోల్డెన్ అవర్ లో సమాచారాన్ని అందిస్తే బాధితుల డబ్బు సురక్షితంగా తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
ప్రజల భద్రత, యువత భవిష్యత్తు రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి
సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి...
దస్తూరాబాద్: ‘సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం'
సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తాం అని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు...
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...
హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం...
హత్య కేసు చేదించిన పోలీసులు
మహబూబాబాద్లో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేదించిన పోలీసులు...
యాకయ్య భార్యతో...