విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు.

0
198
బాపట్ల: విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు. బాపట్లలోని ప్రభుత్వ ఎస్సీ, సమీకృత ఎస్టీ బాలికల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ వసతి గృహంలో వసతులు, భోజన నాణ్యత, నీటి సరఫరా, క్రీడా కిట్లు తదితరాలను పరిశీలించారు. ఎస్టీ వసతి గృహంలో అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేసి, మెనూ అమలు, భోజన నాణ్యత, సిబ్బంది పర్యవేక్షణపై ఆరా తీశారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని, ట్యూటర్ నియామకం, దోమల మెష్, ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు జిల్లాలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు. బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, కుర్చీలు, ప్రింటర్లు వంటి వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆ వివరాల ఆధారంగా దాతలు సహకరించవచ్చని తెలిపారు.
ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు ఈ వెబ్‌సైట్ కీలకంగా మారుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు నేరుగా లాభం చేకూరేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు.
 
#Narendra
Search
Categories
Read More
Business & Finance
Trademark Rectification Corrects Brand Record Errors
Trademark Rectification allows businesses to correct errors, remove inaccuracies, or update...
By Navya Sree 2026-07-22 05:35:58 0 21
Andhra Pradesh
గోవుల అక్రమ రవాణా భగ్నం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను...
By Shyamala Yadagiri 2026-03-18 03:28:05 0 285
Andhra Pradesh
కర్నూలు మెడికల్ కాలేజీలో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు !!
కర్నూలు : కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సాయంతో రూ.50 కోట్లతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు...
By Hari Krishna 2025-12-27 16:10:48 0 191
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
By Kothuru Murali 2026-01-30 11:43:10 0 171
Andhra Pradesh
మదనపల్లెలో 25 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు.
మదనపల్లె మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఉమ్మడి చిత్తూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు సుమారు...
By Pagadala Venkateswar 2026-02-04 07:27:39 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com