Pawan Kalyan: పార్టీ నేతలకు కీలక సూచన చేసిన పవన్ కల్యాణ్.

0
155

Pawan Kalyan Issues Key Directives to Party Leaders

ఇతర వ్యక్తుల మధ్య జరిగే వాటిని జనసేనకు ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న పవన్

వివాహేతర సంబంధాలను కూడా జనసేనపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్య

దుష్ప్రచాలను పార్టీ శ్రేణులు ఖండించాలని సూచన

జనసేన పార్టీపై ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు కాపు కాస్తున్నారని... పార్టీ పట్ల వారికున్న నిబద్ధత చాలా గొప్పదని ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. సంస్థాగత అంశాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

 

 

 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేన పార్టీకి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

 

ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు వంటి వ్యక్తిగత అంశాలను కూడా జనసేనపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విధమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాలని సూచించారు

Search
Categories
Read More
Business & Finance
Posta Market Closure Disrupts Kolkata Wholesale Trade
Commercial activity at Kolkata's Posta wholesale market was disrupted following an alleged...
By Navya Sree 2026-07-03 06:31:32 0 32
Andhra Pradesh
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా|| వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లను సమర్థవంతంగా...
By Gadiyapudi Narendra 2026-01-06 12:30:45 0 210
Andhra Pradesh
పుంగనూరు: బండ రాయి పడి వలస కార్మికుడి మృతి
పుంగనూరు మండలం, పాలెంపల్లి సమీపంలోని ఓ కార్వీలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్ నాయక్ అనే...
By Kothuru Murali 2026-05-13 18:50:28 0 82
Telangana
ఆటోలు మర్చిపోయిన బంగారాన్ని గంటల వ్యవధిలోనే బాధితులకు అందజేసిన పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి...
By Sidhu Maroju 2025-12-01 10:42:01 0 212
Andhra Pradesh
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం...
By Gadiyapudi Narendra 2026-02-27 04:21:21 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com