సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|

0
93

సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్ ఆసుపత్రి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.

సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో స్ట్రైకర్ మాకో ఆర్థోపెడిక్ రోబోటిక్ యంత్రాన్ని హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆస్పత్రి చైర్మన్ అనిల్ కృష్ణ,ఎండి హరికృష్ణ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోబోటిక్ యంత్రం పనిచేసే తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల మాదిరిగానే వైద్యరంగంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శస్త్ర చికిత్సలు నిర్వహించడం మంచి పరిణామం అని అన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఉద్దేశంతో నూతనంగా తీసుకువచ్చిన రోబోటిక్ యంత్రం మూలంగా అనేక సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. వైద్యుల సమయం వృధా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ సర్జరీలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారు మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్.
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-26 11:20:19 0 53
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
By Kothuru Murali 2026-02-03 05:17:59 0 45
Andhra Pradesh
సంక్రాంతి పండుగ వేళ... పందేల జోలికి పోవద్దు :: కర్నూలు ఇంచార్జీ ఎస్సీ & డీఐజీ
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...సంక్రాంతి పండగల వేళ....పందెంల...
By Hari Krishna 2026-01-11 07:32:31 0 118
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com