నేతన్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్

0
164

*నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్*

 

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

* 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల

* 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ

* 5,726 మందికి లబ్ధి 

* 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత

* త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం

* సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు

 

*అమరావతి* : నేతన్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలియజేశారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్గ్ ఫండ్ నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 5,726 మంది నేతన్నలకు లబ్ధి కలుగనుందన్నారు. ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. గడిచిన డిసెంబర్ లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఇలా కేవల రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనంతో కూడిన ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో వెల్లడించారు. మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. 

 

 

 

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

* 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల

* 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ

* 5,726 మందికి లబ్ధి 

* 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత

* త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం

* సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు

 

*అమరావతి* : నేతన్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలియజేశారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్గ్ ఫండ్ నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 5,726 మంది నేతన్నలకు లబ్ధి కలుగనుందన్నారు. ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. గడిచిన డిసెంబర్ లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఇలా కేవల రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనంతో కూడిన ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో వెల్లడించారు. మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
   హైదరాబాద్ /సికింద్రాబాద్.   శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
By Sidhu Maroju 2025-08-05 17:27:05 0 764
Andhra Pradesh
Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో...
By Pagadala Venkateswar 2026-03-17 08:11:57 0 173
Andhra Pradesh
విలువలతో కూడిన విద్యలో విజయభారతి. ముందంజ: ఎమ్మెల్యే షాజహాన్ బాషా.
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యను అందించడంలో విజయభారతి పాఠశాల...
By Pagadala Venkateswar 2026-03-11 14:22:09 0 153
Andhra Pradesh
APPSC Group 1: ఏపీపీఎస్‌సీ గ్రూప్ - 1 ఫలితాలు విడుదల.
హైకోర్టు ఆదేశాలతో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులు రిజర్వు చేసిన ఏపీపీఎస్‌సీ...
By Pagadala Venkateswar 2026-01-31 06:05:42 0 172
Business & Finance
Delhi's Startup Ecosystem Continues to Attract Investment
Delhi continues to strengthen its position as one of India's leading startup hubs, attracting...
By Navya Sree 2026-06-29 07:41:03 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com