నేతన్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్

0
109

*నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్*

 

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

* 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల

* 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ

* 5,726 మందికి లబ్ధి 

* 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత

* త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం

* సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు

 

*అమరావతి* : నేతన్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలియజేశారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్గ్ ఫండ్ నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 5,726 మంది నేతన్నలకు లబ్ధి కలుగనుందన్నారు. ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. గడిచిన డిసెంబర్ లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఇలా కేవల రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనంతో కూడిన ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో వెల్లడించారు. మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. 

 

 

 

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

* 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల

* 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ

* 5,726 మందికి లబ్ధి 

* 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత

* త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం

* సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు

 

*అమరావతి* : నేతన్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మరో గుడ్ న్యూస్ అందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలియజేశారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రిఫ్గ్ ఫండ్ నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 5,726 మంది నేతన్నలకు లబ్ధి కలుగనుందన్నారు. ఈ నెలలోనే సంక్రాంతి ముందు ఆప్కో ద్వారా రూ.5 కోట్లు బకాయిలను చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. గడిచిన డిసెంబర్ లో కూడా రూ.2.42 కోట్ల మేర ఆప్కో బకాయిలు చెల్లించిన విషయాన్ని కూడా మంత్రి గుర్తు చేశారు. ఇలా కేవల రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకుపైగా నిధులను చేనేత సహకార సంఘాలకు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనంతో కూడిన ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యమని మంత్రి సవిత ఆ ప్రకటనలో వెల్లడించారు. మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల చేయడంపై చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు.

Search
Categories
Read More
Business
Three Additional Strategic Oil Reserves
The Indian government is considering setting up three additional strategic oil reserves, in...
By Bharat Aawaz 2025-07-03 08:13:47 0 2K
Andhra Pradesh
పన్ను బకాయిల చెల్లింపు మీ బాధ్యతగా గుర్తించండి : మున్సిపల్ కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  ‘పన్ను చెల్లింపు బాధ్యతగా భావించండి’• నగరపాలక...
By Hari Krishna 2026-01-19 12:30:38 0 115
Mizoram
Mizoram की पहली रेलवे लाइन: ऐतिहासिक कनेक्टिविटी कदम”
Mizoram ने अपना पहला #RailwayLine Sairang से Aizawl तक चालू करके एक ऐतिहासिक उपलब्धि हासिल करी...
By Pooja Patil 2025-09-12 05:50:20 0 217
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com