Chandrababu: దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.

0
170

రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పుడు నెరవేరుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరుకానున్నారు.

 

ఈ పథకం ద్వారా 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారితో పాటు ప్రయాణించే సహాయకులకు టిక్కెట్‌లో 50 శాతం రాయితీ లభిస్తుంది. గతంలో పరిమిత వర్గాలకే వర్తించిన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు 4 నుంచి 21 కేటగిరీల దివ్యాంగులకు విస్తరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులతో కలిపి మొత్తం 12.76 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. మహిళల కోసం ఉద్దేశించిన ‘స్త్రీ శక్తి’ బస్సుల్లో కూడా దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

 

మంగళగిరిలో పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌, మాధవ్ తదితరులు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు. ప్రయాణం ముగిశాక ముఖ్యమంత్రి వారి కోసం ప్రత్యేకంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలు ‘దివ్యాంగ శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వారు కూడా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు.

 

ఇప్పటికే ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు 52 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేశారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం రూ. 1,826 కోట్లకు పైగా ఖర్చును భరిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడు ‘దివ్యాంగ శక్తి’ ద్వారా మరో కీలక వర్గానికి భరోసా కల్పిస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని
నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది...
By Boya Dasthagiri 2026-04-18 06:36:30 0 146
Andhra Pradesh
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.‌ఈ యునిట్...
By Karapati Gopi 2026-06-24 12:54:55 0 165
Telangana
నిజామాబాద్: పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకురవాలి .అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
అడ్వికేట్‌ప్రోటక్ మాధిరి గానే పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకూ రావల్సినా అవసారం ఎంతైనా...
By Sadaq Sadaq 2026-03-30 18:19:45 0 170
Business & Finance
FSSAI Registration for Safe and Trusted Food Business
FSSAI Registration is mandatory for food businesses to legally manufacture, store, distribute, or...
By Navya Sree 2026-07-21 06:01:18 0 39
Telangana
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾       చీకటిని చీల్చుకుంటూ వచ్చే...
By Vanmoj Suryamohan 2026-01-13 15:03:09 0 512
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com