దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
176

*Davos Tour Day 1*

 

*Press Release 5*

 

*ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ తోడ్పాటు*

 

*యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ*

 

*మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌ ఏర్పాటుపైనా చర్చ*

 

*దావోస్ (స్విట్జర్లాండ్), జనవరి 19:* వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ పని చేసేందుకు అల్ మార్రీ అంగీకారం తెలిపారు. అలాగే యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్ మార్రీకి ముఖ్యమంత్రి వివరించారు. యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు..., డీపీ వరల్డ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయి పోర్ట్ టెర్మినల్స్, లాజిస్టిక్స్ మౌలిక వసతుల అభివృద్ధి..., ఏడీఎన్‌ఓసీ సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు... విశాఖలో లూలూ గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపైనా చర్చించారు. యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భవిష్యత్‌లో యూఏఈ ప్రభుత్వంతో పాటు ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్దమైన RCM, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో "క్రిస్మస్" వేడుకలు ఘనంగా...
By BABJI DADALA 2025-12-24 14:35:32 0 388
Andhra Pradesh
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 1 965. 65 కోట్లు నిధులు విడుదల
*ప్ర‌చుర‌ణార్థం* *19-12-2025*   *ఏపీకి ఎబి-పి.ఎమ్.జె.ఎ.వై ప‌థ‌కం...
By Rajini Kumari 2025-12-19 11:14:36 0 236
Telangana
తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా...!
తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల...
By Sunka Santhosh 2026-06-18 19:22:55 0 131
Andhra Pradesh
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం మూడవ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కూటమి పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్థి, సంక్షేమం –3వ డివిజన్‌లో పర్యటించిన...
By Rajini Kumari 2026-01-10 13:27:06 0 189
Telangana
తెలంగాణ జాగృతి లోకి చాకలి ఐలమ్మ వారసులు శోభా , జ్యోతి చేరిక*
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో ...
By Ponnala Srinivasrao 2026-04-20 01:31:35 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com