విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం

0
161

*విజయవాడ నగరపాలక సంస్థ*

*19-01-2026*

 

 

*ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి*

 

 

 

ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యకు క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని, అర్జీదారులకు వారి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందిస్తామన్న భరోసాని ఇవ్వడమే కాకుండా సత్వరమే అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 4, ఇంజనీరింగ్ 3, పబ్లిక్ హెల్త్ 1, రెవెన్యూ 1 మొత్తం కలిపి 9 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ i/c పి సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీ వి.కామేశ్వరరావు పాల్గొన్నారు. 

 

 

 

Search
Categories
Read More
Telangana
మొయినాబాద్లో విషాదం.. యువకుడు సూసైడ్
మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగా బుర్ర మల్లేష్ అనే యువకుడు...
By Veeresh Kumar 2026-05-23 16:15:04 0 303
Business & Finance
Investment Promotion Initiatives Boost Business Confidence in Madhya Pradesh
Madhya Pradesh is actively engaging with domestic and international investors through investment...
By Navya Sree 2026-07-04 07:08:08 0 38
Chhattisgarh
Chhattisgarh Strengthens Mining and Mineral Development
Chhattisgarh continues to reinforce its position as one of India's leading mineral-producing...
By Fathima Safa 2026-07-03 15:04:59 0 31
Andhra Pradesh
పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ...
By Kothuru Murali 2026-05-07 12:09:25 0 91
Andhra Pradesh
చింతూరు: తల్లి, బిడ్డ మృతి శోక సంద్రంలో కుటుంబం!
చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన గర్భిణీ దుర్గాలక్ష్మీ పురిటినొప్పులతో చింతూరు ప్రభుత్వ...
By Shyamala Yadagiri 2026-06-10 15:04:00 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com