AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.

0
182

ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి

హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ

నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని హెచ్చరిక

కొత్త నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొత్త, కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. క్రమశిక్షణ, సమయపాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు తప్పనిసరిగా చేరుకోవాలని స్పష్టం చేసింది. ఆ సమయం తర్వాత హాజరు నమోదు చేస్తే దానిని 'లేట్ ఇన్‌'గా పరిగణిస్తారు.

 

కొత్త నిబంధనల ప్రకారం నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (వెసులుబాటు సమయం) ఉంటుంది. ఇక హాఫ్-డే సెలవు తీసుకునే వారికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం విధులకు హాజరయ్యేవారు ఒంటి గంట లోపు హాజరు నమోదు చేయాలి. ఆ తర్వాత వస్తే 'లేట్ ఇన్‌'గా లెక్కిస్తారు. అలాగే ఉదయం విధులకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టేవారు 12:30 గంటల కంటే ముందు 'ఔట్ టైమ్' నమోదు చేయకూడదు.

 

పాఠశాల ముగిసే సమయానికి సంబంధించి కూడా నిబంధనలను కఠినతరం చేశారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సాయంత్రం 3:30 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైమ్ నమోదు చేసినా, ఉన్నత పాఠశాలల టీచర్లు సాయంత్రం 4 గంటల కంటే ముందు నమోదు చేసినా దానిని 'ఎర్లీ ఔట్'గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదయం ఇన్-టైమ్ నమోదు చేసి, సాయంత్రం ఔట్-టైమ్ నమోదు చేయడం మరిచిపోతే, వారు ఆ రోజంతా గైర్హాజరైనట్లే లెక్క. అంటే ఉదయం వచ్చిన వెంటనే వెళ్లిపోయినట్లుగా భావిస్తారు.

 

నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత

పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిమిషం ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడింది. గతంలో ఉన్న 10 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది. హాజరు నమోదు చేసే యాప్ కొన్నిసార్లు సరిగా పనిచేయదని, అటువంటి సాంకేతిక సమస్యలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం అన్యాయమని పేర్కొంది. ప్రభుత్వం తమను "ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ"గా చెప్పుకుంటూ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం విరుద్ధమని సంఘం నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలపై పునరాలోచిస్తుందా? లేదా యథాతథంగా అమలు చేస్తుందా? అనేది వేచి చూడాలి.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్పీలకు రూ. 24 వేల జీతం ఇవ్వాలంటూ నిరసన.
మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) నిరసన ధర్నా చేపట్టారు. మున్సిపల్...
By Pagadala Venkateswar 2026-04-13 12:44:28 0 145
Andhra Pradesh
Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత.
చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత   శాంతిభద్రతలకు...
By Pagadala Venkateswar 2026-02-01 08:40:22 0 146
Andhra Pradesh
కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు
కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు...
By Hari Krishna 2025-12-29 13:52:41 0 223
Jharkhand
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...
By Fathima Safa 2026-06-24 09:34:03 0 94
Punjab
Punjab Expands Education and Skill Development Drive
Punjab continues to strengthen its education and skill development ecosystem through initiatives...
By Fathima Safa 2026-06-27 04:06:04 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com