ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
182

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.

 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ₹. 60.000 విలువైన చెక్కును లబ్ధిదారుడు రాజుకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు అందాల్సిన ఫలాలు సకాలంలో చేరాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఆపదలో ఉన్న కుటుంబానికి తో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తమది ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు  అందేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.  ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా  త్వరితగతిన సహాయం అందేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, సాజిత్, తదితరులు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: సిపిఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ, నిందితుడికి కఠిన...
By Kothuru Murali 2026-04-06 07:13:47 0 123
Andhra Pradesh
అనంతపురం జిల్లా :కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు...
By Eslavath RameshNaik 2026-01-17 11:15:33 0 469
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 114
Telangana
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
By Sidhu Maroju 2025-12-23 11:59:58 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com