Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు.

0
122

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి

 

23న విచారణకు రావాలని మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ

రెండు రోజుల క్రితం వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన వైనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది.

 

ఇదివరకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొంతకాలం ఉన్నారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని 22వ తేదీన విచారణకు రావాలని కోరిన ఈడీ, ఆ మరుసటి రోజే మిథున్ రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఇది ఎక్సలెంట్ న్యూస్: సీఎం చంద్రబాబు 30-01-2026 Fri 14:07 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-31 06:42:17 0 157
Telangana
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు
కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం   60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10...
By Pinnehasan Odela 2026-02-24 15:54:56 0 122
Andhra Pradesh
నులిపురుగుల నివారణ పై అవగాహన
*విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ*   ****************************** మంగళగిరి...
By Rajini Kumari 2026-02-17 10:43:37 0 129
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, ఉప్పరపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో ఆదివారం దివంగత నేత...
By Kothuru Murali 2026-01-19 12:32:53 0 118
Andhra Pradesh
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు : వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
By Hari Krishna 2025-12-21 14:02:53 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com