అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు

0
586

అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు 

జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పార్శిల్ సర్వీస్ కార్యాలయాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

 

జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు... గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా అనంతపురం త్రీటౌన్ సి.ఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనంతపురం త్రీటౌన్ పరిధిలోని వివిధ పార్శిల్ సర్వీస్ కార్యాలయాలు మరియు ఆర్టీసీ బస్టాండులలో స్నిఫర్ డాగ్ సహకారంతో విస్తృత తనిఖీలు కొనసాగాయి. పార్శిళ్ల ద్వారా గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టి ప్రజల భద్రతను కాపాడడమేనని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత మరియు గంజాయి కట్టడి దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద పార్శిళ్లపై అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే ప్రజలు ఎవరైనా మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని టెన్నిస్ విజేతలకు బహుమతులు
*ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం.*...
By Rajini Kumari 2026-01-19 11:35:06 0 184
Business & Finance
J&K Seeks Relief to Ease Livestock Transport Costs
Jammu and Kashmir Chief Minister Omar Abdullah has urged the Punjab Government to address alleged...
By Navya Sree 2026-06-30 05:25:38 0 47
Andhra Pradesh
కేబుల్ మెడకు తగిలి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చీరాల మండలంలో విషాద ఘటన
చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:25:12 0 191
Telangana
ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా...
By Sidhu Maroju 2026-01-28 15:20:09 0 191
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ గారుబుధవారం పుంగనూరులో పర్యటించారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పుంగనూరు పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2025-12-31 14:33:00 0 316
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com