యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్

0
113

కర్నూలు : కర్నూలు సిటీ : 

*

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
స్థానిక ఎస్టిబిసి కళాశాల మైదానంలో  టిజిబి, లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో క్రీడలు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టమన్నారు.  క్రికెట్ పోటీలలో  80 జట్లు పాల్గొనడం విశేషం అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబి,లక్కీ టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, తన తనయుడు టీజీ భరత్ పేరు మీద మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 50వేల రూపాయలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారు ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని టీజీ తెలిపారు. అలాగే క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు లక్కీ టు గోపి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లి లోనిYSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడుదల రజిని
19.12.2025 తాడేప‌ల్లి   - చంద్ర‌బాబు మార్క్ దోపిడీకి మెడిక‌ల్ కాలేజీల...
By Rajini Kumari 2025-12-20 14:16:57 0 140
Andhra Pradesh
పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*   •...
By Rajini Kumari 2026-04-02 16:27:29 0 72
Andhra Pradesh
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త..   ...
By Rajini Kumari 2025-12-17 08:27:13 0 157
Telangana
ఎంపి చేసిన అభివృద్ధి పనులు మేమే చేసామనడం సిగ్గుచేటు : బీజేపీ నాయకులు.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా...
By Sidhu Maroju 2026-01-07 05:45:05 0 144
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 131
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com