యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్

0
142

కర్నూలు : కర్నూలు సిటీ : 

*

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
స్థానిక ఎస్టిబిసి కళాశాల మైదానంలో  టిజిబి, లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో క్రీడలు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టమన్నారు.  క్రికెట్ పోటీలలో  80 జట్లు పాల్గొనడం విశేషం అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబి,లక్కీ టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, తన తనయుడు టీజీ భరత్ పేరు మీద మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 50వేల రూపాయలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారు ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని టీజీ తెలిపారు. అలాగే క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు లక్కీ టు గోపి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిల్లకల్లు గ్రామంలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం
జగ్గయ్యపేట    కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ...
By Rajini Kumari 2026-01-06 10:58:42 0 165
Telangana
బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి...
By Nookapangu Manikanta 2026-04-20 14:35:06 0 220
Tamilnadu
Actor, Krishna, Detained By Chennai Police In Cocaine Case
So far, 22 individuals - including a few police personnel - have been arrested in connection with...
By Bharat Aawaz 2025-06-25 16:33:55 0 3K
Andhra Pradesh
మదనపల్లిలో కోడి పందాల స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్.
మదనపల్లి మండలం సిటిఎం ఆంజనేయుని గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురిని తాలూకా పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-26 11:13:13 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com