Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.

0
237

Andhra

TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District

కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్తత

దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు

 

గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో, ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందాడు. మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దుర్గా ప్రసాద్, శ్రీరామమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ కార్యకర్తలు నారాయణమూర్తి, సతీశ్ లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో... వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. 

 

ఘర్షణ వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్తలు ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తుండగా వారికి వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. పాత గొడవలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు
 తేదీ: 12-05-2026 (మంగళవారం) మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్...
By Avunoori Mahesh 2026-05-12 17:11:15 0 194
Andhra Pradesh
Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-06 03:54:07 0 134
Business & Finance
Close Your Company Legally with Expert Guidance
Winding up a company is the legal process of closing a business by settling liabilities,...
By Navya Sree 2026-07-14 06:52:23 0 62
Bihar
Mining Jackpot: Rare Minerals Found in Banka & Bhagalpur
Bihar is emerging as a massive hotspot on India’s mineral map. The state government...
By Dunna Jessicaruth 2026-05-21 05:27:41 0 102
Jammu & Kashmir
Digital Census and Self-Enumeration Kick Off in J&K
A major demographic milestone began today as the official census process rolled out across Jammu...
By Dunna Jessicaruth 2026-05-20 11:35:38 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com