Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.

0
125

Andhra

TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District

కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్తత

దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు

 

గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో, ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందాడు. మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దుర్గా ప్రసాద్, శ్రీరామమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ కార్యకర్తలు నారాయణమూర్తి, సతీశ్ లకు కూడా తీవ్ర గాయాలు కావడంతో... వీరిని కూడా ఆసుపత్రికి తరలించారు. 

 

ఘర్షణ వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్తలు ఒక పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తుండగా వారికి వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. పాత గొడవలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి...
By Benguluri Madhubabu 2026-02-26 10:51:17 0 137
Andhra Pradesh
మదనపల్లెలో సారా కేసు – నిందితుడిపై పీడీ యాక్ట్.
మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్...
By Pagadala Venkateswar 2026-04-03 05:44:08 0 53
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: ప్రజల్లో 90 శాతం సంతృప్తి ఉండాల్సిందే: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-02 11:18:18 0 88
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com