మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు

0
192

 తేదీ: 12-05-2026 (మంగళవారం) మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ శ్రీ చందన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పిన్నింటి రఘునాథ రెడ్డి  హాజరై నర్సింగ్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. నర్సులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతు ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సుల పాత్ర ఎంతో గొప్పది, రోగి బాధను తన బాధగా భావించి సేవ చేయడం ఒక మహోన్నతమైన పని. వైద్య రంగంలో డాక్టర్లతో సమానంగా నర్సులు కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన నర్సుల త్యాగం ఎప్పటికీ మరువలేనిది అని అన్నారు.అంతేకాకుండా ఆయన మాట్లాడుతు మనిషి జీవితంలో అత్యంత కష్టసమయంలో ముందుగా కనిపించే దేవత నర్స్. సేవే పరమోన్నత ధర్మమని నిరూపిస్తూ నర్సులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వైద్య సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని తెలిపారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్ , మంచిర్యాల కార్పొరేషన్ ప్రెసిడెంట్ తూముల నరేష్ , 52వ డివిజన్ కార్పొరేటర్  స్రవంతి కిషోర్ , మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి పెంట రజిత  పాల్గొని నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్ సెల్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు నర్సింగ్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న...
By Kothuru Murali 2026-02-03 05:13:55 0 176
Andhra Pradesh
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు....
By Pagadala Venkateswar 2026-04-05 11:11:11 0 202
Andhra Pradesh
తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు
వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు...
By Gadiyapudi Narendra 2026-03-01 16:11:52 0 225
Andhra Pradesh
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*   గన్నవరం నియోజకవర్గ...
By Rajini Kumari 2026-01-04 11:12:58 0 232
Andhra Pradesh
స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది...
By Pagadala Venkateswar 2026-02-02 07:21:58 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com