Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు.

0
101

 

 

Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు

05-03-2026 Thu 21:39 | Andhra

 

Chandrababu Naidu Announces 25000 Incentive for Third Child in Andhra Pradesh

మూడో బిడ్డకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన

నెలకు వెయ్యి చొప్పున పౌష్టికాహార సాయం మరియు ఉచిత విద్య

ప్రసూతి సెలవులు ఏడాదికి పెంపు మరియు తండ్రులకు రెండు నెలల సెలవు

రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై సీఎం చంద్రబాబు ఆందోళన

ఏప్రిల్ 1 నుంచి నూతన జనాభా నిర్వహణ విధానం అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త 'జనాభా నిర్వహణ విధానం' ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

 

ముసాయిదా పాలసీ వివరాలను సీఎం వెల్లడిస్తూ.. మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి, యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత కోసం టీఎఫ్ఆర్ రేటును 2.1కి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

 

గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ (కుటుంబ నియంత్రణ) నినాదం ఉండేదని, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా 'పాపులేషన్ కేర్' (జనాభా సంరక్షణ) విధానానికి మారుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ఇప్పటికే కూటమి ప్రభుత్వం తొలగించిందని గుర్తుచేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని అనే ఐదు దశల విధానంతో ప్రజలకు అండగా ఉంటామన్నారు. పిల్లలు లేనివారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో ఐవీఎఫ్ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ పాలసీపై నెల రోజులు చర్చించి, మార్చి నెలాఖరుకు ఖరారు చేసి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.

Search
Categories
Read More
Telangana
యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ఎగ్జిక్యూటివ్ మీటింగ్... యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చార్ల సందీప్.
మెదక్ జిల్లా యూత్ కాంగ్సెస్ అసెంబ్లీ అధ్యక్షులు చార్ల సందీప్ గారి అధ్యక్షతన నర్సాపూర్...
By Gangaram Rangagowni 2025-12-28 12:42:21 0 185
Andhra Pradesh
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర...
By Pagadala Venkateswar 2026-02-16 11:01:53 0 216
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 2K
Andhra Pradesh
ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*   * మంగళగిరి...
By Rajini Kumari 2026-02-20 23:18:49 0 125
Andhra Pradesh
గూడూరు ఇంచార్జ్ ఎస్సై డి వై. స్వామి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు కోడుమూరు సీఐ తబ్రేజ్ సూచన మేరకు మొహర్రం...
By mahaboob basha 2025-07-04 00:52:45 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com