రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది

0
200

.       

రైతుల స‌మ‌స్య‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంది. 

మందడం గ్రామంలో రైతుల భేటీలో సుజనా చౌదరి 

 

కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి రైతుల‌కు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం మంద‌డంలో స్థానిక నాయకుడు మాదల రాజేంద్ర నివాసంలో సుజ‌నా చౌద‌రితో రైతులు భేటీ అయ్యారు... ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని గ్రామాల‌కు చెందిన ప‌లువురు                 

      సుజనా ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు . పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతుల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో అధికారులు అల‌స‌త్వం వ‌హిస్తున్నార‌ని సుజ‌నా చౌద‌రి కి రైతులు తెలిపారు. కొందరు అధికారుల తీరు వల్ల సమస్యలు జటిలం అవుతున్నాయని రైతులు వివరించారు. 29వేల మంది రైతుల‌లో కేవ‌లం రెండు శాతం మంది ఎద‌ర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు స‌రిగా స్పందించ‌క పోవ‌డం వ‌ల్ల అది అంద‌రి రైతుల స‌మస్య‌గా ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేగుతోంద‌ని ఆవేద‌నం వ్య‌క్తం చేశారు. ఈ కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని తెలిపారు. 2019 నుంచి 24 వ‌ర‌కు రాజ‌ధానిని కాపాడుకోవ‌డంలో చేసిన పోరాటంలో సుజ‌నా చౌద‌రి స‌హ‌కారాన్ని ,ప్ర‌మేయాన్ని రైతులు కొనియాడారు. అధికారుల తీరు వల్ల గతంలో 14 అంశాలకు సంబంధించి సమస్యలుండగా ప్రస్తుతం అవి 20 అంశాలు దాటాయని రైతులు వాపోయారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి రైతుల‌తో ప‌లు అంశాల‌ను చ‌ర్చించారు. కూటమి సర్కారు రైతుల సంస్థలను ఖచ్చితంగా పరిష్కరిస్తుందని సుజ‌నా చౌద‌రి రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు. రైతులంతా ఐక్యంగా ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లాలని సూచించారు.. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కాకుండా రైతుల తరపున 4గురు ప్రతినిధులుగా ఎంపిక చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మానిటరింగ్ చేసుకోండనీ రైతుల‌కు సుజ‌నా సలహా ఇచ్చారు. సమస్యల అర్జీల స్టేటస్, ట్రాకింగ్ కోసం అవసరమైతే రైతులకు నా తరపున ఒక సాఫ్ట్వేర్ మెకానిజం ను అంద చేస్తానని రైతులకు సుజ‌నా హామీ ఇచ్చారు. . స్తానిక ఎమ్మెల్యే, ఎంపీ పెమ్మసాని, మంత్రి నారాయణ అందరూ సామర్థ్యం ఉన్న నాయకులే కాబ‌ట్టి వారి తో సమన్వయంతో ముందుకు సాగండనీ రైతుల‌కు సూచించారు. అమరావతి రాజధాని గా ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం చట్టం చేస్తుంద‌ని, దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు ప్రాసెస్ లో ఉన్నాయని సుజ‌నా వివ‌రించారు. కూట‌మి స‌ర్కార్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివ్రిద్దికి క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు మాద‌ల శ్రీనివాస్, యుగంధ‌ర్ , ధ‌నేకుల రామారావు, మ‌హిళ‌లు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పాత నేరస్తులకు మెగా కౌన్సెలింగ్: మహిళల గౌరవానికి ప్రతిజ్ఞ.
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలో ‘మెగా కౌన్సెలింగ్ - పరివర్తన...
By Pagadala Venkateswar 2026-04-23 03:38:55 0 99
Andhra Pradesh
కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
 చింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ...
By Shyamala Yadagiri 2026-03-14 05:26:27 0 333
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో SIR కార్యక్రమం నిర్వహించడం జరిగింది
   యెమ్మిగనూరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు  ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-06-09 14:11:35 0 206
Telangana
పొంగులేటి సమక్షంలో ఏదులాపురం ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనిత...
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ఏదులాపురం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Krishna Balina 2026-02-23 09:07:19 0 341
Andhra Pradesh
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ని కోటేశ్వరరావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్ని కోటేశ్వరావు గారు అనారోగ్యంతో...
By Rajini Kumari 2026-01-25 11:08:53 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com