ఆల్వాల్ ల్లో "మూడవ కన్ను" : సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|

0
257

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా భద్రతను పర్యవేక్షించడం సవాలుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు "నేను సైతం" మరియు "కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు" కింద స్థానిక వ్యాపారులు నివాసితుల సహకారంతో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి అనేక నేరాలలో సహాయపడతాయి.

సున్నిత ప్రాంతమైన, మచ్చ బొల్లారం మార్కెట్ ప్రధాన రహదారులు, వాణిజ్య సముదాయాలు ఉండే జంక్షన్ లు, మరియు అంతర్గత కాలనీ ఎంట్రీ పాయింట్ల వద్ద 8 కెమెరాలను  బిగించారు. వీటి ద్వారా లభించే ఫీడ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లేదా కమాండ్ సెంటర్ కు అనుసంధానించడం ద్వారా పోలీసులు నిరంతర నిఘా ఉంచుతున్నారు. 

ఈ నిఘా కెమెరాలను అల్వాల్ ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో  సమానం. మీలాగే అందరూ కాలనీవాసులు స్ఫూర్తి పొంది సీసీ కెమెరాలు నియమించుకోవడం వల్ల నేరాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఒకవేళ నేరాలు జరిగితే నేరస్తులను గుర్తించడంలో  సీసీ కెమెరాలు ఎంతో సహాయం చేస్తాయన్నారు. ఈ సీసీ కెమెరాలను సమకూర్చిన కాలనీవాసులను ఎస్ హెచ్ ఓ అభినందించారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, సబ్ ఇన్స్పెక్టర్ దేవేందర్, టెక్నికల్ టీం,  పిఎస్ సిబ్బంది, మరియూ కాలనీ వాసులు పాల్గొన్నారు.

నిఘా కెమెరా ఉంటే, నేరస్థుడికి భయం ఉంటుంది. అనే నినాదంతో అల్వాల్ ల్లో జరుగుతున్న ఈ ప్రక్రియతో స్థానికులలో భద్రతాభావం పెరుగుతుంది. 

మీ మీ ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేకపోతే స్థానిక పోలీసుల సూచన మేరకు వాటిని ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. 

#sidhumaroju

 

 

Search
Categories
Read More
Kerala
V.D. Satheesan Named Kerala’s 24th Chief Minister
The Congress High Command officially ended ten days of political suspense by naming V.D....
By Dunna Jessicaruth 2026-05-14 09:55:05 0 149
SURAKSHA
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు చేపట్టిన కమ్యూనిటీ కిచెన్ సేవా కార్యక్రమ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
విశాఖపట్నంలో ఏపీ పోలీసులు ప్రతిరోజూ 1,000 మంది నిరుపేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు....
By Kalaga Sailaja 2026-07-01 05:55:00 0 54
Sports
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్...
By Avunoori Mahesh 2026-05-01 08:59:26 0 203
Telangana
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించి నా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర...
By Ponnala Srinivasrao 2026-05-12 00:48:41 0 123
Andhra Pradesh
మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ ప్రారంభోత్సవం చిల్లపల్లి శ్రీనివాసరావు
*మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ బ్రాంచ్ శుభారంభం*   *-తెలుగురాష్ట్రాల్లో విస్తరిస్తున్న...
By Rajini Kumari 2026-01-28 12:58:58 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com