ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి

0
144

BREAKING

 

విజయవాడ 

 

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC చీఫ్ 

 

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనే.

 

- ⁠మహానేత ఒత్తిడితో 2006 లో ఉపాధికి శ్రీకారం చుట్టింది ఏపీలోనే . 

 

- దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయం. 

 

- పనికి ఆహార పథకం అమలులో అప్పుడు YSR పాలన దేశానికే ఆదర్శం. 

 

- కరువు పని సక్సెస్ లో నాడు ఏపీ రోల్ మోడల్. 

 

- ఉమ్మడి రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, బ్రతుకు జీవనాన్ని గ్యారెంటీ చేయడానికి, 

 

- వలసలు నివారించి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి, వ్యవసాయానికి సాయంగా,

 

- YSR గారి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి ఆశయాలకు ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. 

 

- 2006 నుంచి నేటి వరకు 20 ఏళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లు వచ్చాయంటే, 

 

- ఏడాదికి కోటి మందికి ప్రత్యక్షంగా పని గ్యారెంటీ అయ్యిందంటే కాంగ్రెస్ తెచ్చిన నరేగా చట్టం పుణ్యమే.

 

- ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిన దేశ ద్రోహి ప్రధాని మోడీ గారు. 

 

- పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారు. 

 

- చట్టాన్ని మార్చి ఉపాధి హామీలో ఊపిరి తీశారు. 

 

- మోడీ గారు తెచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీలో ఉపాధి లేనట్లే. 

 

- కాంగ్రెస్ అమలు చేసిన నరేగా పథకానికి, బీజేపీ తెచ్చిన జీ రామ్ జీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 

 

- వీబీ జీ రామ్ జీ ఒక నల్లచట్టం. పేదల పొట్టకొట్టిన చట్టం. 

 

- ఉపాధిని హక్కుగా తీసేసి కేంద్రమే దిక్కుగా మార్చిన అక్రమ చట్టం. 

 

- రాష్ట్రాల మీద ఆర్థిక భారం మోపి,గ్రామస్వరాజ్యం వినాశనమే ధ్యేయంగా మోడీ గారు చేస్తున్నది నీచపు పాలన.

 

- నరేగా చట్టంలో 100 రోజుల ఉపాధి ఒక హక్కు. 

 

- ఏ గ్రామంలోనైనా,ఏ సీజన్ లోనైనా పని కోరే హక్కు ప్రజలది. 

 

- పనుల తీరు నిర్ణయాధికారం గ్రామసభలది. 

 

- 100 రోజుల పనికి ఇచ్చే వేతనాలు పూర్తిగా కేంద్రానివే. 

 

- వీబీ జీ రామ్ జీ చట్టంలో పనులు గ్రామసభ కాకుండా డిల్లీ సభ నిర్ణయిస్తుందట. 

 

- ఇదెక్కడి న్యాయం..ఇదేం చట్టం ? అన్ని గ్రామాల్లో కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పని కల్పిస్తారా? 

 

- ఒకరికి అన్నం పెట్టి మరొకరికి సున్నం పెడతారా ? ఏడాదికి 60 రోజులు పని బంద్ పెట్టడం ఇదేం నియంత చట్టం ? 

 

- 40 శాతం రాష్ట్రాలు నిధులు ఇవ్వకపోతే ఉపాధి ఎలా దక్కుతుంది ? 

 

- కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా పనులు పరిమితం చేయడమంటే ప్రజలను పరిమితం చేస్తున్నట్లు కాదా ? 

 

- గ్రామ ఆస్తుల్లో కాకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం అంటే కార్పొరేట్ వ్యవస్థలను పోషిస్తున్నట్లు అవ్వదా ?

 

- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. 

 

- AICC పిలుపు మేరకు, దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయ సాధనను కాపాడేందుకు..

 

- APCC ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలకు శ్రీకారం చుడుతున్నాం. 

 

 

- కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు,రైతు సంఘాలను కలుపుకొని అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. 

 

- వీబీ జీ రామ్ జీ అక్రమ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. 

 

- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు పరచాలి.

Search
Categories
Read More
Jammu & Kashmir
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood The Trinamool Congress (TMC) has...
By BMA ADMIN 2025-05-23 11:05:54 0 2K
Andhra Pradesh
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను భర్తరాఫ్ చేయాలి, (సిపిఎం
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సోలార్ పరిశ్రమకు సేకరించిన భూముల వలన నష్టపోయిన...
By mahaboob basha 2025-09-04 14:20:14 0 345
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ల పరిశీలన కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస     *అన్న క్యాంటీన్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి*...
By Rajini Kumari 2025-12-30 10:40:15 0 188
Andhra Pradesh
పుంగునూరు:టీడీపీ మైనారిటీ నాయకులు SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని కలిశారు.
2026 జనవరి 21న, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి సూచన మేరకు, టీడీపీ మైనారిటీ...
By Kothuru Murali 2026-01-22 12:33:05 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com