సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం

0
176

*For scrolls*

 

*అమరావతి :-*

 

*సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం*

 

*జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష*

 

*ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి సీఎం ప్రసంగం*

• విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం.

• 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రజల ఆశల్ని నిలబెట్టాం. వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం

• అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగాం

• ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను

• తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశాం

• స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. దీని కోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశాం

• అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశాం

• దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగాం. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశాం

• ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్తమైలు రాయిని సాధించాం. 

• 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశాం

• అమరావతిని స్మశానం అని, ఎడారని ఎగతాళి చేశారు. కానీ ఇదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు 

• అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. 

• పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు

• ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. 

• పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం

• నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంది

• ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి

• పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది

• తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. 

• రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు

• పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం

• భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తాం

• విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర సహకారంతో రూ.12 వేల కోట్ల సాయంతో దానిని కాపాడుకున్నాం

• విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ ఆ ప్లాంట్ ను నిలబెట్టి తీరుతాం

• దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి

• పెట్టుబడులకు డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలు అన్నీ సాకారం అయితే 16 ల క్షల మందికి ఉద్యోగాలు వస్తాయి

• ఎస్ఐపీబీ ద్వారా 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చాం. వీటి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి

• గూగుల్ కూడా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది

• రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలో కృషి చేసిన అధికారులు, ప్రభుత్వ విభాగాలను అభినందిస్తున్నాను

• అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం. ఆరు నెలల్లో క్వాంటం కంప్యూటర్ ఇక్కడి నుంచి పనిచేస్తుంది

• విద్యుత్ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించగలిగాం. భవిష్యత్తులో రూ.1.19 పైసల మేర యూనిట్ కొనుగోలు ధర తగ్గించటం లక్ష్యంగా పనిచేస్తున్నాం

• ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లలోనూ 970 టీఎంసీలను నింపగలిగాం. రాయలసీమలోనూ పెద్ద ఎత్తున నీటిని నిలిపాం

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఐజీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా... కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి...
By Hari Krishna 2026-01-01 16:08:27 0 230
Andhra Pradesh
సచివాలయంలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  అమరావతి, సచివాలయం (22-06-2026).    *సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు...
By Benguluri Madhubabu 2026-06-22 13:41:02 0 132
Andhra Pradesh
DSF ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై...
By Boya Dasthagiri 2026-06-02 12:53:51 0 175
Telangana
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...
By Sidhu Maroju 2025-11-18 09:12:14 0 213
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com