గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్స్ ను పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ లో భాగంగా నడి రోడ్డు లో మీద పేరెడ్ నిర్వహించారు.

0
297

 

>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు

 

 గుంటూరు జిల్లా పోలీస్... తేది : 10.01.2026 🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సెలింగ్ నిర్వహించిన గుంటూరు జిల్లా పోలీసులు. 📍సాధారణ కౌన్సిలింగ్ గా భ్రమించి హాజరైన వారికి రౌడీ షీటర్లు నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ రుచి చూపించిన గుంటూరు జిల్లా పోలీసులు. 📍 కౌన్సెలింగ్ అనంతరం, గుంటూరు నగరంలోని లక్ష్మిపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు పరేడ్ నిర్వహించగా, "పోలీస్ మార్క్ కౌన్సెలింగ్" రౌడీ షీటర్ల లో కనపడింది. 🔅 ప్రజా శాంతికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టానికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. 🔅 మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 🔅 జిల్లాలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాటిని అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 🔅 ప్రస్తుతం ప్రజలకు డయల్ 112 వంటి హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని, రౌడీయిజం లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు జరిగితే నిమిషాల్లోనే పోలీసుల దృష్టికి చేరుతాయని తెలిపారు. 🔅 రౌడీ, KD, DCల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, అవసరమైతే PD యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు. 🔅 ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని, నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు. 🔅 నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించామని, మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు, బీట్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 🔅 గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా పెంచామని, భవిష్యత్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 🔅 కౌన్సెలింగ్ సమయంలో, సంబంధిత వ్యక్తులు ప్రస్తుతం జీవిస్తున్న విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న వృత్తులపై పోలీసులు ఆరా తీశారు. 🔅 ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు, గొడవలు, అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. 🚔 జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే లక్ష్యంగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం గుంటూరు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శబరిమల అయ్యప్ప స్వామి గారిని దర్శించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట...
By Kothuru Murali 2026-01-08 12:34:45 0 120
Andhra Pradesh
సీఎం సమీక్షకు హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై...
By Pagadala Venkateswar 2026-02-17 05:25:18 0 102
Andhra Pradesh
యువత మాదక ద్రవ్యాలకి దూరం గా ఉండాలి !
కర్నూలు :కర్నూలు జిల్లా... మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు...
By Hari Krishna 2025-12-24 16:31:17 0 179
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా : MLC.శంబిపూర్ రాజు.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ...
By Sidhu Maroju 2025-12-28 10:01:22 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com