మెదక్ జిల్లా గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి... సీఎం కప్పు ర్యాలీ నిర్వహణ... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

0
177

మెదక్ జిల్లా గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు ముఖ్యమంత్రి కప్ టార్చ్ ర్యాలీని వివిధ శాఖల జిల్లా అధికారులు తో కలిసి టార్చిని వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు.కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ సి.యం కప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనని తెలిపారు.గత సంవత్సరం మాదిరిగానే  ఈ సంవత్సరం కూడా సీఎం కప్ ‌ క్రీడా కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు.ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించే దిశగా ‌ ముందుకు పోతుందని గుర్తు చేశారు.పల్లెలోని యువత,విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని దీనివల్ల శారీరక దృఢత్వం తో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి సాధన చేసి జిల్లా లోనే కాక జాతీయ,అంతర్జాతీయ వేదికలపై కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు,కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్.సి.సి క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ ర్యాలీ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు వరకు కొనసాగింది.

Search
Categories
Read More
Telangana
మేడారం లో ఘనంగా ప్రతిష్టపన మహోచ్చవం
*మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునస్థాపన కార్యక్రమంలో మంత్రి సీతక్క...
By CM_ Krishna 2025-12-24 11:48:48 0 144
Goa
गोआत पशु चिकित्सालय कॉलेज सुरूवात आता पुढल्या वर्षांत
गोआ सरकाराक ह्या वर्षीचो #पशु_चिकित्सालय_कॉलेज सुरू करपाची आशा आसली, पण प्रशासनिक अडचणी आनी...
By Pooja Patil 2025-09-11 10:43:16 0 547
Andhra Pradesh
Vijayasai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి ఈడీ విచారణ.
ఏపీ మద్యం స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ హైదరాబాద్‌లో దాదాపు 7 గంటల పాటు సాగిన...
By Pagadala Venkateswar 2026-01-22 15:02:17 0 52
Andhra Pradesh
Ayyanna Patrudu: సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో...
By Pagadala Venkateswar 2026-02-07 07:36:26 0 35
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com