మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ

0
221

మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ

ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ ద్వారా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వైసీపీ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ మెడికల్ కళాశాలలను తాము ఏర్పాటు చేశామని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల జోక్యం ఉండకూడదని, అలా జరిగితే పేదలకు వైద్య విద్యా అవకాశాలు దూరమవుతాయని ఆ పార్టీ వాదిస్తోంది. అప్పటి ప్రభుత్వం ఈ కళాశాలల నిర్వహణకు బడ్జెట్ భారం లేకుండా చూసుకునేలా విధానాలు రూపొందించిందని, కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్‌కు కేటాయించి ఆ ఆదాయాన్ని ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించేలా మార్గదర్శకాలు తయారు చేసిందని కోర్టుకు పిల్ లో వివరించింది.పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ఈ కళాశాలలను నడిపిస్తే వైద్య విద్య మాత్రమే కాకుండా, సామాన్యులకు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండవని, అవి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ తన పిల్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆర్థిక భారం ఎక్కువగా ఉందన్నది వాస్తవం కాదని, ఇందుకు సంబంధించి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కోటి సంతకాలు సేకరించామని కూడా కోర్టుకు తెలిపింది.టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్‌లను వైసీపీ చేర్చింది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:46:04 0 190
Business & Finance
Heavy Rain Alert Brings Mixed Impact to Uttarakhand Economy
The India Meteorological Department (IMD) has issued heavy rain alerts for multiple districts...
By Navya Sree 2026-07-01 06:29:20 0 124
Andhra Pradesh
వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త...
By Mobbu Venkatramana 2026-02-07 08:30:54 0 412
Telangana
నిజామాబాద్
గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపి ధర్మపురి అర్వింద్ గారి కృషితో ఇందూరులో జాతీయ పసుపు బోర్డు కార్యాలయo...
By Sadaq Sadaq 2026-05-29 11:58:13 0 98
Telangana
ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా : పట్టణంలోని పద్మావతి గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్...
By Avunoori Mahesh 2026-06-14 10:00:28 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com