హనుమాన్ సుందరకాండ పారాయణం లో పాల్గొన్న ఎమ్మెల్యే

0
109

కర్నూలు : నంద్యాల : డోన్ : 

డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా, శాంతి సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు  శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే  శ్రీమతి శ్ర కోట్ల సుజాతమ్మ నాల్గవ రోజు డోన్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా సుందరకాండ పర్యాయాన్ని రచించి గానం చేసిన  ఎం.ఎస్. రామారావు గారి మనవడు శ్రీ శ్రీనివాస్ స్వామిజీ  భక్తి శ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  హనుమంతుడిని ప్రత్యేకంగా ప్రార్థించి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ ,శ్రీమతి శ్రీ కోట్ల నివేదితమ్మ ,  పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సుందరకాండ పారాయణం అనంతరం స్వామిజీ గారు ఆశీర్వచనాలు అందించగా, కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా కొనసాగుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం...
By Kothuru Murali 2026-02-17 08:36:08 0 27
Andhra Pradesh
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్  బాపట్ల:  ఐవిఎస్ సర్వేలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:33:59 0 116
Andhra Pradesh
మదనపల్లెలో గోవుల అక్రమ రవాణా.
మదనపల్లి మీదుగా తమిళనాడు వైపు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి జనసేన...
By Pagadala Venkateswar 2026-01-24 06:11:41 0 58
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com