హనుమాన్ సుందరకాండ పారాయణం లో పాల్గొన్న ఎమ్మెల్యే
కర్నూలు : నంద్యాల : డోన్ :
డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా, శాంతి సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్ర కోట్ల సుజాతమ్మ నాల్గవ రోజు డోన్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా సుందరకాండ పర్యాయాన్ని రచించి గానం చేసిన ఎం.ఎస్. రామారావు గారి మనవడు శ్రీ శ్రీనివాస్ స్వామిజీ భక్తి శ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమంతుడిని ప్రత్యేకంగా ప్రార్థించి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ ,శ్రీమతి శ్రీ కోట్ల నివేదితమ్మ , పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సుందరకాండ పారాయణం అనంతరం స్వామిజీ గారు ఆశీర్వచనాలు అందించగా, కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా కొనసాగుతుంది.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz