అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 

0
245

అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియా ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు యువతి నికిత గోడిశాల (27) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తే ఆమెను హత్య చేసి, అనంతరం ఇండియాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నికిత చివరిసారిగా డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో కనిపించిందని ఆమె పాత స్నేహితుడు అర్జున్ శర్మ (26) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ ఇండియాకు పారిపోవడంతో అతనిపై పోలీసులకు అనుమానం బలపడింది.

ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అర్జున్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ విగతజీవిగా పడివున్న నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తి పోటు గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు.

నికితను హత్య చేసిన అనంతరం అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని కోరారు. ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తుకు వెళ్లింది.

మరోవైపు, హత్యకు గురైన నికిత గోడిశాల సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా సమాచారం. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అమెరికాలో మరోసారి తెలుగు యువతి హత్య జరగడం పట్ల ప్రవాస తెలుగు సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-05-23 01:43:53 0 595
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 170
Andhra Pradesh
పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక...
By Kothuru Murali 2026-03-02 03:27:23 0 124
Telangana
సీవరేజ్ పనులు వేగవంతం చేయాలి.|
- లక్ష్మీనగర్‌లో పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి - గడువులోగా...
By Sidhu Maroju 2026-07-19 07:26:57 0 54
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-02-19 06:54:12 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com