అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 

0
244

అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియా ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు యువతి నికిత గోడిశాల (27) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తే ఆమెను హత్య చేసి, అనంతరం ఇండియాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నికిత చివరిసారిగా డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో కనిపించిందని ఆమె పాత స్నేహితుడు అర్జున్ శర్మ (26) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ ఇండియాకు పారిపోవడంతో అతనిపై పోలీసులకు అనుమానం బలపడింది.

ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అర్జున్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ విగతజీవిగా పడివున్న నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తి పోటు గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు.

నికితను హత్య చేసిన అనంతరం అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని కోరారు. ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తుకు వెళ్లింది.

మరోవైపు, హత్యకు గురైన నికిత గోడిశాల సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా సమాచారం. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అమెరికాలో మరోసారి తెలుగు యువతి హత్య జరగడం పట్ల ప్రవాస తెలుగు సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
అంగరంగ వైభవంగా మల్లంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన...
అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన....   భారత్ అవాజ్ న్యూస్:...
By Gujile Ramu 2026-05-05 16:34:41 0 136
SURAKSHA
Senior Suraksha Program Protects Elderly Living Alone in Karnataka
Karnataka Police launched ‘Senior Suraksha’ to support elderly living alone. Beat...
By Kalaga Sailaja 2026-07-01 11:01:41 0 71
Himachal Pradesh
Himachal Launches QR-Based Food Grain Distribution System
The Himachal Pradesh Food, Civil Supplies and Consumer Affairs Department has introduced a QR...
By Navya Sree 2026-06-26 08:42:24 0 87
Andhra Pradesh
నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె...
By Pagadala Venkateswar 2026-02-07 07:10:24 0 209
Andhra Pradesh
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమo విజయోత్సవ సభ
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి,...
By Chennaiah Kati 2026-06-18 11:54:11 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com