అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 

0
243

అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు! 

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియా ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు యువతి నికిత గోడిశాల (27) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తే ఆమెను హత్య చేసి, అనంతరం ఇండియాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నికిత చివరిసారిగా డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో కనిపించిందని ఆమె పాత స్నేహితుడు అర్జున్ శర్మ (26) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ ఇండియాకు పారిపోవడంతో అతనిపై పోలీసులకు అనుమానం బలపడింది.

ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అర్జున్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ విగతజీవిగా పడివున్న నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తి పోటు గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు.

నికితను హత్య చేసిన అనంతరం అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని కోరారు. ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తుకు వెళ్లింది.

మరోవైపు, హత్యకు గురైన నికిత గోడిశాల సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా సమాచారం. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అమెరికాలో మరోసారి తెలుగు యువతి హత్య జరగడం పట్ల ప్రవాస తెలుగు సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ఇదేనా బండి సంజయ్ మీ సంస్కారం..? ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడులా..?
తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది....
By Ponnala Srinivasrao 2026-05-09 02:21:23 0 121
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ!!
కర్నూలు : కర్నూలు జిల్లా...* రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... *...
By Hari Krishna 2025-12-26 00:23:29 0 205
Andhra Pradesh
మదనపల్లి: బైక్ రేసర్లపై కేసు నమోదు.
మదనపల్లె తాలూకాలో బైక్ రేసర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం బైక్ రేసర్లతో పాటు...
By Pagadala Venkateswar 2026-04-06 04:30:43 0 162
Andhra Pradesh
రహదారులపై భద్రతే ప్రజల జీవితాలకు రక్ష: జిల్లా కలెక్టర్
మదనపల్లి బైపాస్ రోడ్డులోని పీపీఆర్ ఫంక్షన్ హాల్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ...
By Pagadala Venkateswar 2026-02-01 08:01:25 0 151
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మసీదు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం తిమ్మానాయన పల్లి పంచాయతీ, ఊటుపల్లెలో నూతన మసీదు నిర్మాణ పనులకు...
By Kothuru Murali 2026-05-05 15:22:35 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com