అల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|

0
85

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం,  ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున ఆనంద్ రావు నగర్ కు చెందిన తిలక్ రాజ్ (28) పై లక్ష్మణ్ యాదవ్, సోను యాదవ్, రాము, మరియు అంజి అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తిలక్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి.  

క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం  వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. 

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులు మరియు మృతుడు బంధువులని కుటుంబ కలహాల కారణాల గానే ఈ ఘటన జరిగినట్టు తేలిందన్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే  తెలియజేస్తామని ఆయన తెలిపారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు |
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం కేసులో...
By Bharat Aawaz 2025-09-20 10:36:11 0 551
Andhra Pradesh
పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి...
By Kothuru Murali 2026-02-10 07:31:56 0 25
Telangana
స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి
సికింద్రాబాద్ :   గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి...
By Sidhu Maroju 2025-10-06 18:45:42 0 151
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 06:20:10 0 21
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com