అల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|

0
134

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం,  ఈ నెల 4వ తేదీ తెల్లవారు జామున ఆనంద్ రావు నగర్ కు చెందిన తిలక్ రాజ్ (28) పై లక్ష్మణ్ యాదవ్, సోను యాదవ్, రాము, మరియు అంజి అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తిలక్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి.  

క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం  వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడు ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 ప్రాంతంలో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. 

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులు మరియు మృతుడు బంధువులని కుటుంబ కలహాల కారణాల గానే ఈ ఘటన జరిగినట్టు తేలిందన్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే  తెలియజేస్తామని ఆయన తెలిపారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
By Pagadala Venkateswar 2026-01-26 11:16:46 0 103
Andhra Pradesh
ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమిmP లు
*Photos:-* ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన కూటమి ఎంపీలు. కేంద్రమంత్రి...
By Rajini Kumari 2025-12-19 10:02:08 0 136
Andhra Pradesh
కోతులను తరిమే ప్రయత్నంలో ప్రమాదం: రైతు తీవ్రంగా గాయపాటు.
మదనపల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, చీకిలబైలు గ్రామానికి చెందిన రైతు చిన్నయ్య తన...
By Pagadala Venkateswar 2026-03-21 15:33:02 0 99
Telangana
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా...
By Sidhu Maroju 2026-03-31 10:14:11 0 83
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు...
By Kothuru Murali 2026-01-20 14:21:58 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com