23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

0
170

ప్రకటన

 

విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవి" అలంకారం లో దర్శనమిచ్చుట మరియు ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసములు గురించి.

@@@

 

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ, శుక్రవారం నాడు శ్రీ పంచమి (వసంత పంచమి) పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టడమైనది.

 

 చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికె. శీనానాయక్ తెలిపారు.

 

అమ్మవారి అలంకారం:

 

శ్రీ పంచమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారు "శ్రీ సరస్వతీ దేవి" అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్వేత వస్త్రధారిణియై, చేతిలో వీణను ధరించి, పుస్తకము, అక్షరమాలను పట్టుకుని జ్ఞానప్రదాయినిగా అమ్మవారు అటు ప్రధాన ఆలయంలోను, ఇటు మహా మండపం 6వ అంతస్తులో భక్తులను అనుగ్రహించనున్నారు.

 ఉదయం నుండే భక్తులు ఈ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు.

 

సామూహిక అక్షరాభ్యాసములు:

చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడానికి శ్రీ పంచమి అత్యంత ప్రశస్తమైన రోజు కావడంతో, దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం సామూహిక అక్షరాభ్యాసములు ఏర్పాటు చేశారు.

మల్లికార్జున మహామండపం 6 వ అంతస్తులో 

 ఉదయం 07:00 గంటల నుండి ప్రారంభమవుతాయి.

దేవస్థానం యాగశాల లో శ్రీ సరస్వతి యాగం నిర్వహించబడును.

 

 అక్షరాభ్యాసానికి కావలసిన పలక, బలపం మరియు ఇతర పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది.

 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమైనది. భక్తులకు ఉచిత ప్రసాదం మరియు తాగునీటి సౌకర్యం కల్పించబడింది. వసంత పంచమి రోజున సరస్వతీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

ఈ సందర్బంగా విద్యార్థులకు దేవస్థానం నుండి ఇచ్చుట నిమిత్తం పెన్ను, అమ్మవారి చిత్రం, కుంకుమ తదితరముల ప్యాకింగ్ మహా మండపం 4 వ అంతస్తులో ఫెస్టివల్ సెక్షన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.

 

సదా శ్రీ దుర్గా మల్లేశ్వరుల సేవలో...

 

చైర్మ

న్, కార్యనిర్వహణా ధికారి.

Search
Categories
Read More
Telangana
అంగరంగ వైభవంగా మల్లంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన...
అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన....   భారత్ అవాజ్ న్యూస్:...
By Gujile Ramu 2026-05-05 16:34:41 0 103
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విచ్చేసిన గద్య అనురాధ
*మహిళల సాధికారతకు విద్యే పునాది : గద్దె అనురాధ*            ...
By Rajini Kumari 2026-03-07 12:07:36 0 197
Andhra Pradesh
ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా...
By Benguluri Madhubabu 2026-03-09 09:54:19 0 146
Andhra Pradesh
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త
మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం...
By Eslavath RameshNaik 2026-01-17 15:34:35 0 438
Andhra Pradesh
మదనపల్లి లో శ్రీవారి బస్సు ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ...
By Pagadala Venkateswar 2026-02-27 07:12:00 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com