గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్.

0
349

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఘన స్వాగతం పలికి, అనంతరం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం, రెడ్డిపాలెం నుండి స్వర్ణ భారతి నగర్ వరకు ర్యాలీలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసినవి:

👉 గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,48వ డివిజన్ పరిధిలోని,రెడ్డిపాలెం నందు రూ.10.99 కోట్ల వ్యయంతో పూర్తయిన 22 పనుల

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవములు .

👉 గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,46వ డివిజన్ పరిధిలోని రూ.29.75 కోట్ల వ్యయంతో పూర్తయిన 127 పనుల శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవములు.

👉గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,47వ డివిజన్ పరిధిలోని రూ.8.11 కోట్ల వ్యయంతో పూర్తయిన 28 పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవములు.

👉 గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,41వ డివిజన్, స్వర్ణ భారతి నగర్ నందు గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన రూ.48 కోట్ల వ్యయంతో 4.25 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ - 3 పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

👉అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని,41 వ డివిజన్,స్వర్ణ భారతి నగర్,శిల్పారామం నందు జరిగిన బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర గారు,గుంటూరు తూర్పు శాసనసభ్యులు శ్రీ మొహమ్మద్ నసీర్ అహ్మద్ గారు, గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు శ్రీమతి గళ్ళా మాధవి గారు,గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారు, గుంటూరు నగర పాలక సంస్థ శ్రీ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు,లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు,శ్రీ డేగల ప్రభాకర్ గారు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్పొరేటర్లు,రాష్ట్ర జిల్లా,మండల,గ్రామ,స్థాయి నాయకులు,అభిమానులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి
బ్రేకింగ్ న్యూస్   తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి టార్గెట్ చేరుకోలేకపోయిన సింగరేణి...
By Pinnehasan Odela 2026-04-01 07:17:51 0 155
Andhra Pradesh
APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని...
By Chennaiah Kati 2026-02-03 18:07:28 0 205
Andhra Pradesh
National Road Safety Month
As part of the 37th National Road Safety Month, a "National Road Safety Walkathon" was organized...
By Terli Ashok 2026-01-25 05:22:18 0 269
Telangana
మంటలు రేపిన మెయిన్ ఆర్ యు బి - బిజెపి బీఆర్ఎస్ కార్యకర్తల రచ్చ . |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  స్థానిక ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. గేటు వద్ద గంటల...
By Sidhu Maroju 2026-01-13 16:12:45 0 237
Jharkhand
Jharkhand Promotes Tourism and Eco-Travel in 2026
Jharkhand has continued to promote tourism in 2026 by enhancing infrastructure at key...
By Fathima Safa 2026-07-01 10:04:19 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com