చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

0
24

 

 

 

చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు

రాజకీయ ప్రత్యర్థుల కేసులపై కోర్టు ఆగ్రహం

పాలసీ నిర్ణయాలకు నేరం ఆపాదించడం తప్పని వ్యాఖ్య

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆక్షేపణ

ఫైనల్ తీర్పులో లార్డ్ డెన్నింగ్ సూత్రాలు

రాష్ట్రంలో పాలకులు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు పెట్టే రాజకీయ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి బ్రేక్ వేసింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన సీఐడీ కేసును కొట్టేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు కేవలం రాజకీయ ప్రతీకారంతో పెట్టిందే తప్ప, ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు స్పష్టం చేశారు.

 

చట్టాన్ని బలహీనులకు రక్షణ కవచంగా వాడాలి.. ఆయుధంగా కాదు!

ప్రముఖ అంతర్జాతీయ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చెప్పిన ప్రసిద్ధ సూత్రాలను ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. "చట్టం అనేది శక్తిమంతుల చేతిలో ప్రత్యర్థులను అణచివేసే ఆయుధంగా మారకూడదు.. అది కేవలం బలహీనులకు రక్షణ కవచంగా మాత్రమే ఉండాలి" అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు తమ తర్వాత వచ్చే ప్రభుత్వం కేసులతో వేధిస్తుందనే భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సబ్ రిజిస్టార్ పై రూ. 70 వేల ముడుపులు ఆరోపణలు..
పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక నివాస గృహ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్...
By Kothuru Murali 2026-06-30 16:32:08 0 98
Andhra Pradesh
శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
చీరాల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు  శ్రీ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-23 12:27:08 0 177
Andhra Pradesh
పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు....
By Kothuru Murali 2026-01-28 09:36:18 0 163
Uttar Pradesh
Congress Appoints Rajendra Pal Gautam as UP In-Charge
The Congress party has appointed Rajendra Pal Gautam as the new All India Congress Committee...
By Navya Sree 2026-06-27 05:54:34 0 75
Telangana
జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!   Apr 25, 2026, తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్...
By Midathapalli Kiran Kumar 2026-04-25 05:49:27 0 293
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com