మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.

0
104

గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు నేటి నుండి మూడు రోజుల(3,4,5వ తేదీలు) పాటు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి మారిషస్ అధ్యక్షులు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ గారు సతీసమేతంగా ఈ రోజు సాయంత్రం గుంటూరు విచ్చేసారు.

 📍ఈ సందర్భంగా ఆయన రాకను పురస్కరించుకుని ITC వెల్కమ్ హోటల్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు మారిషన్ దేశాధ్యక్షుల వారికి, మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారు కూడా పాల్గొన్నారు.

📍గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరపున ఘనమైన పోలీస్ గౌరవ వందనం కూడా సమర్పించారు.ITC వెల్కమ్ హోటల్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

👉 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(ఏఆర్) శ్రీ హనుమంతు గారు,RDO శ్రీనివాసరావు గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు, ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు
పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం...
By Mobbu Venkatramana 2026-02-02 12:12:46 0 320
Andhra Pradesh
మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు: కమిషనర్
కర్నూలు :  మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-08 11:33:14 0 116
Andhra Pradesh
కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
*కేరళ* రాజధాని *త్రివేండ్రం* (తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది...
By Rajini Kumari 2026-02-10 10:35:15 0 53
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com