వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా సావిత్రీ బాయి పూలే జ‌యంతి వేడుకలు.

0
167

జ‌యంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పార్టీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షులు న‌ల‌మారు చంద్ర‌శేఖర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షులు నారాయ‌ణ మూర్తి, బీసీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ద‌స్త‌గిరితోపాటు ప‌లు పార్టీ విభాగాలనాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హాజరు. 

- సావిత్రీ బాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకం

- మహిళాభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె సేవలు చిరస్మరణీయం : వైయస్సార్సీపీ నేతలు

తాడేప‌ల్లి:

మ‌హిళ‌ల్లో అక్ష‌రాస్య‌త పెంచ‌డం ద్వారా మహిళాభ్యుదం, సాధికార‌త సాధ్య‌మ‌ని గ్ర‌హించి అందుకోసం పాటుబ‌డిన మ‌హ‌నీయురాలు సావిత్రీబాయి పూలే అని వైయస్సార్సీపీ నాయ‌కులు కొనియాడారు. సావిత్రీబాయి పూలే జ‌యంతి సందర్భంగా తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ నాయ‌కులు ఆమె చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే ఆశ‌యాల‌కు అనుగుణంగానే గ‌త వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు వినూత్న మార్పులు తీసుకురావ‌డ‌మే కాకుండా మహిళ‌ల‌ను ఉన్న‌త స్థానాల్లో నిల‌బెట్టి రాజ‌కీయంగా ప్రోత్స‌హించార‌ని గుర్తు చేశారు. ఆఖ‌రి శ్వాస వ‌రకు కూడా ప్ర‌జా సేవ‌లోనే గ‌డిపిన సావిత్రీ బాయి జీవితం నేటి రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు. ఎన్నో అవ‌మానాలు, అవ‌రోధాల‌ను దాటుకుని భ‌ర్త స‌హకారంతో మహిళ‌ల కోసం విద్యాల‌యాలు స్థాపించి వారి అభ్యున్న‌తి కోసం కృషి చేశార‌ని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు,...
By Pagadala Venkateswar 2026-02-20 07:17:59 0 87
Telangana
మంగాపురం తండాలో నీటి సమస్యకు సర్పంచ్ పరిష్కారం...
పాలేరు నియోజకవర్గ పరిధిలోని మంగాపురం తండా గ్రామపంచాయతీలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి...
By Krishna Balina 2026-02-23 09:20:25 0 123
Andhra Pradesh
నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
నగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:33:15 0 232
Andhra Pradesh
నగిరి లో సీఎం పర్యటనలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
చిత్తూరు జిల్లా నగిరి లో సీఎం పర్యటనలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘన స్వాగతం...
By Benguluri Madhubabu 2026-01-24 06:00:37 0 174
Andhra Pradesh
L Subbarayudu: తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు.
ఈ నెల 28వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్న ఎస్పీ సుబ్బరాయుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...
By Pagadala Venkateswar 2026-02-02 04:56:05 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com