మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

0
176

కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పదోన్నతి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిద్దలూరు మరియు బెస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల అత్యంత సానుకూలంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలు కోరిన 15 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 13 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు పదవీ విరమణ చేసిన అనంతరం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000 రూపాయలకు పెంచడం, మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని 15,000 రూపాయలు, పదవీ విరమణ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.. తమ చిరకాల వాంఛ అయిన పదోన్నతిని కల్పించినందుకు, అలాగే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ.
అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం సచివాలయం, అసెంబ్లీ భవనాల...
By Pagadala Venkateswar 2026-04-30 04:30:32 0 65
Telangana
కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద...
By Prashanth Goindla 2026-04-05 13:50:31 0 242
Telangana
మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో...
By Sidhu Maroju 2026-03-29 14:29:03 0 123
Andhra Pradesh
బోయకొండ ఆలయ అధికారులపై ఫిర్యాదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ ఆలయ అధికారులపై వచ్చిన పలు ఫిర్యాదులకు సంబంధించి...
By Kothuru Murali 2026-01-11 08:03:38 0 129
Andhra Pradesh
మదనపల్లెలో వృద్ధురాలి స్థలం కబ్జా.. అండగా నిలిచిన పోలీసులు.
మదనపల్లెలోని సురభికాలనీలో నివసించే చెంగమ్మ అనే వృద్ధురాలి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు...
By Pagadala Venkateswar 2026-03-07 04:56:34 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com