పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

0
210

ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం రైతులకు,భూ యజమానులకు క్యూ ఆర్ కోడ్ తో ముద్రించబడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడుతూ:

రైతుల క్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన థ్యేయం.

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి రైతుకు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకంపై రాజకీయాలకు సంబంధించిన ఎటువంటి ముద్రలు మరియు చిత్రాలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుంది. 

రైతు చేతికి వెళ్ళాక ఎటువంటి తప్పులు ఉండకుండా ఉండేలా ముందస్తుగానే ప్రభుత్వ సూచన మేరకు యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది. 

వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న భుహక్కు భూ రక్ష పథకం పేరుతో భూములను రీసర్వే చేసింది. 

రే సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతుల భూములకు సంబంధించి భూ హక్కు పత్రం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని పట్టాదారు పాసుపుస్తకం పై ముద్రించారు. 

రి సర్వే లో అనేక లోపాలున్నా వాటిని సరిచేయకుండా వదిలేశారు. 

రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో భూ యజమాని చిత్రంతో, రాజముద్రతో అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు నుండి మండలాల వారీగా సభల్లో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,రెవెన్యూ అధికారులు,రైతులు,భూ యజమానులు,అభిమానులు,కార్యకర్తలు,మహిళలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు!!!!
పీపీపీ పద్ధతి అంటే అర్థం తెలియని జగన్ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నిజానికి పీపీపీ...
By SivaNagendra Annapareddy 2025-12-22 10:22:56 0 173
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఆరోగ్య కేంద్రంలో క్షయ నివారణపై అవగాహన సదస్సు
ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు,...
By Kothuru Murali 2026-03-24 13:34:44 0 258
Telangana
నిజామాబాద్
గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపి ధర్మపురి అర్వింద్ గారి కృషితో ఇందూరులో జాతీయ పసుపు బోర్డు కార్యాలయo...
By Sadaq Sadaq 2026-05-29 11:58:13 0 98
Andhra Pradesh
Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: కాంగ్రెస్ నేతలు బట్టలు విప్పి తిరగడం దారుణం: సీఎం చంద్రబాబు 21-02-2026 Sat...
By Pagadala Venkateswar 2026-02-21 11:17:14 0 160
Telangana
ఏడు కాలనీల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జీఎంను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి".|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి...
By Sidhu Maroju 2026-06-09 09:04:10 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com