సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు.|

0
191

హైదరాబాద్ : ఐదేళ్ల క్రితం జరిగిన హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్య కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఐదుగురు మహిళలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

 

అల్వాల్ కు చెందిన రాచర్ల పవన్ కుమార్(38) సజీవ దహనం కేసులో న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించారు.

 

ఈ కేసు వివరాల్లోకి వెళితే... జగిత్యాలకు చెందిన విజయ్ కొండగట్టుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఓ కుట్టిరాన్ని నిర్మించుకున్నాడు. అయితే విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు.

విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్ కుమార్ భార్య కృష్ణవేణి లతో కలిసి 2020 అక్టోబర్ 20 న కుటీరానికి చేరుకున్నాడు.

 

అయితే పవన్ కుమార్ తన భర్తకు చేతబడి చేసి చంపించాడని ఆరోపిస్తూ అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత భర్తతో కలిసి అతన్ని కుటీరంలో బంధించి పెట్రోల్ ఒంటిపై పోసి నిప్పంటించింది.

 

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గది తాళం తీయగా పవన్ పూర్తిగా దహనమయ్యాడు. 

 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పవన్ కుమార్ భార్య కృష్ణవేణి తో పాటు మరో ఐదుగురు మహిళలు ఈ కేసులో నిందితులుగా తేలారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ సాక్షదారాలను పరిశీలించిన న్యాయస్థానం కృష్ణవేణి సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైధు తో పాటు రూ. పదివేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

 

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:53:03 0 161
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కలెక్టర్ నిశాంత్ కుమార్ టిడిపి అబ్జర్వర్ అన్న అనిత యాదవ్ గారు
*అన్నమయ్య జిల్లా – రాయచోటి నియోజకవర్గం* *📅 20-06-2026*   *🌾 రాయచోటి సాయి శుభకళ్యాణ...
By Benguluri Madhubabu 2026-06-20 12:21:07 0 122
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు  : కర్నూలు జిల్లా  కర్నూలు జిల్లా.   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
By Hari Krishna 2026-02-03 12:31:43 0 530
Telangana
Telangana Accelerates Sports Infrastructure Development
Telangana continues to strengthen its sports ecosystem through sustained investments in modern...
By Fathima Safa 2026-06-29 11:15:17 0 47
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సోలార్ కంచెను దాటలేక మరోవైపు తిరిగిన ఏనుగులు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు...
By Kothuru Murali 2026-04-08 07:31:45 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com