ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి

0
206

BREAKING

 

విజయవాడ 

 

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC చీఫ్ 

 

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR నేతృత్వంలో జాతీయ ఉపాధి హామీ(MGNREGA) చట్టానికి బీజం పడింది రాష్ట్రంలోనే.

 

- ⁠మహానేత ఒత్తిడితో 2006 లో ఉపాధికి శ్రీకారం చుట్టింది ఏపీలోనే . 

 

- దివంగత ముఖ్యమంత్రి YSR సారథ్యంలో నరేగా చట్టం ఆనాడు రాష్ట్రంలో అద్భుత విజయం. 

 

- పనికి ఆహార పథకం అమలులో అప్పుడు YSR పాలన దేశానికే ఆదర్శం. 

 

- కరువు పని సక్సెస్ లో నాడు ఏపీ రోల్ మోడల్. 

 

- ఉమ్మడి రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, బ్రతుకు జీవనాన్ని గ్యారెంటీ చేయడానికి, 

 

- వలసలు నివారించి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి, వ్యవసాయానికి సాయంగా,

 

- YSR గారి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి ఆశయాలకు ఊతం ఇచ్చిందే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. 

 

- 2006 నుంచి నేటి వరకు 20 ఏళ్లలో రాష్ట్రానికి లక్ష కోట్లు వచ్చాయంటే, 

 

- ఏడాదికి కోటి మందికి ప్రత్యక్షంగా పని గ్యారెంటీ అయ్యిందంటే కాంగ్రెస్ తెచ్చిన నరేగా చట్టం పుణ్యమే.

 

- ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిన దేశ ద్రోహి ప్రధాని మోడీ గారు. 

 

- పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారు. 

 

- చట్టాన్ని మార్చి ఉపాధి హామీలో ఊపిరి తీశారు. 

 

- మోడీ గారు తెచ్చిన కొత్త చట్టం ఉపాధి హామీలో ఉపాధి లేనట్లే. 

 

- కాంగ్రెస్ అమలు చేసిన నరేగా పథకానికి, బీజేపీ తెచ్చిన జీ రామ్ జీ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. 

 

- వీబీ జీ రామ్ జీ ఒక నల్లచట్టం. పేదల పొట్టకొట్టిన చట్టం. 

 

- ఉపాధిని హక్కుగా తీసేసి కేంద్రమే దిక్కుగా మార్చిన అక్రమ చట్టం. 

 

- రాష్ట్రాల మీద ఆర్థిక భారం మోపి,గ్రామస్వరాజ్యం వినాశనమే ధ్యేయంగా మోడీ గారు చేస్తున్నది నీచపు పాలన.

 

- నరేగా చట్టంలో 100 రోజుల ఉపాధి ఒక హక్కు. 

 

- ఏ గ్రామంలోనైనా,ఏ సీజన్ లోనైనా పని కోరే హక్కు ప్రజలది. 

 

- పనుల తీరు నిర్ణయాధికారం గ్రామసభలది. 

 

- 100 రోజుల పనికి ఇచ్చే వేతనాలు పూర్తిగా కేంద్రానివే. 

 

- వీబీ జీ రామ్ జీ చట్టంలో పనులు గ్రామసభ కాకుండా డిల్లీ సభ నిర్ణయిస్తుందట. 

 

- ఇదెక్కడి న్యాయం..ఇదేం చట్టం ? అన్ని గ్రామాల్లో కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పని కల్పిస్తారా? 

 

- ఒకరికి అన్నం పెట్టి మరొకరికి సున్నం పెడతారా ? ఏడాదికి 60 రోజులు పని బంద్ పెట్టడం ఇదేం నియంత చట్టం ? 

 

- 40 శాతం రాష్ట్రాలు నిధులు ఇవ్వకపోతే ఉపాధి ఎలా దక్కుతుంది ? 

 

- కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా పనులు పరిమితం చేయడమంటే ప్రజలను పరిమితం చేస్తున్నట్లు కాదా ? 

 

- గ్రామ ఆస్తుల్లో కాకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం అంటే కార్పొరేట్ వ్యవస్థలను పోషిస్తున్నట్లు అవ్వదా ?

 

- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. 

 

- AICC పిలుపు మేరకు, దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయ సాధనను కాపాడేందుకు..

 

- APCC ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలకు శ్రీకారం చుడుతున్నాం. 

 

 

- కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు,రైతు సంఘాలను కలుపుకొని అన్ని జిల్లాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. 

 

- వీబీ జీ రామ్ జీ అక్రమ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. 

 

- మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు పరచాలి.

Search
Categories
Read More
Bharat Aawaz
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...
By Bharat Aawaz 2025-06-27 11:11:22 0 1K
Telangana
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం...
By Vanmoj Suryamohan 2026-01-31 06:56:34 0 457
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:30 0 256
Dadra &Nager Haveli, Daman &Diu
Healthcare Infrastructure and Public Health Progress
Healthcare infrastructure expansion and public health programs remained a key focus in 2026,...
By Fathima Safa 2026-06-22 10:34:36 0 148
Telangana
పెద్దపెల్లి : గోపు ఐలయ్య యాదవ్ ఇకలేరు
బి ఆర్ ఎస్ నేత గోపు ఐలయ్య యాదవ్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించడం జరిగింది. రెండు రోజుల క్రితం...
By Sunka Santhosh 2026-06-03 18:56:37 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com