Pawan Kalyan: మనకెందుకులే అనుకోవద్దు... ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుంది: పవన్ కల్యాణ్.

0
45

హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు మౌనం వీడాలని పవన్ పిలుపు

 

కేవలం భక్తులుగా కాకుండా ధర్మ సంరక్షకులుగా ఉండాలన్న డిప్యూటీ సీఎం

కులం, ప్రాంతం వేరైనా మన ధర్మం ఒక్కటేనని వ్యాఖ్య

మన విశ్వాసాలను కాపాడుకోవడమంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ

ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుందని, హిందూ దేవుళ్లను, ధర్మాన్ని కించపరిచినప్పుడు మౌనంగా ఉండకుండా తమ గళాన్ని వినిపించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సగటు హిందువు మనస్తత్వంలో మార్పు రావాలని, భయంతో లేదా సౌలభ్యం కోసం మౌనంగా ఉండే ధోరణిని వీడాలని ఆయన సూచించారు. దేవుడిపై భయం, విశ్వాసంపై గౌరవం ఉన్నప్పటికీ, మన ధర్మాన్ని ఎవరైనా దురుద్దేశంతో అపహాస్యం చేసినప్పుడు కేవలం వ్యక్తిగతంగా బాధపడి, కర్మకు వదిలేసి ముందుకు సాగే అలవాటు మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను వివరిస్తూ, "మనం కులం, మతం, ప్రాంతం, భాషల పరంగా విభజనకు గురై ఉండవచ్చు. కానీ మనందరి ధర్మం ఒక్కటే, దేవుళ్లు కూడా అంతే. మన విశ్వాసాలను, ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు మన బాధను తెలియజేయడం మనందరి కర్తవ్యం. ఇలాంటి కీలక సమయాల్లో పాటించే మౌనం సమిష్టి చైతన్యాన్ని బలహీనపరుస్తుంది" అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ కేవలం భక్తులుగా మిగిలిపోకుండా, తమ విశ్వాసాలకు స్పృహతో కూడిన సంరక్షకులుగా కూడా వ్యవహరించాలని ఆయన కోరారు.

 

హిందూ ధర్మాన్ని రక్షించుకోవడమంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ సొంత విశ్వాసాలను, సంప్రదాయాలను కాపాడుకోవడం మాత్రమేనని ఆయన వివరించారు. హిందువులు తమ ధార్మిక బాధ్యతను గుర్తించి, సోమరితనం వీడి, తమ విశ్వాసాల పరిరక్షణకు సమిష్టిగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మార్పు ద్వారానే హిందూ ధర్మం యొక్క గౌరవాన్ని కాపాడుకోగలమని ఆయన ట్వీట్

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking.. విజయవాడ    పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
By Rajini Kumari 2025-12-16 13:21:34 0 145
Andhra Pradesh
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా...
By John Baji 2026-02-11 05:54:56 0 41
Telangana
దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా...
By Sidhu Maroju 2025-07-02 09:32:27 0 1K
Andhra Pradesh
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి...
By Gadiyapudi Narendra 2026-01-01 12:02:34 0 134
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*   *ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్...
By Rajini Kumari 2025-12-15 07:41:35 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com